Nizamabad Crime: బెంచీ మీద కూర్చునే విషయంపై విద్యార్థుల మధ్య గొడవ.. ఛాతీపై బలంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Crime: మెస్ హాల్లోని బెంచ్పై కూర్చోవడంపై ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒక విద్యార్థి మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో చోటుచేసుకుంది.
Read also: Bandi Sanjay: సచివాలయంలో అగ్ని ప్రమాదం.. క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే..
Also Read
నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్కు చెందిన ఓవిద్యార్థి(14) బర్ధిపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి, మరో విద్యార్థి మధ్యాహ్న భోజన సమయంలో మెస్ హాల్లోని బెంచ్పై కూర్చోవడానికి పోటీపడ్డారు. ‘నేనే ఫస్ట్ వచ్చాను, నేనే ఫస్ట్ వచ్చాను’ అని ఇద్దరూ వాదించారు. అయితే సదరు విద్యార్థి పడికిలి బిగించి మరో విద్యార్థిని బలంగా ఛాతీపై కొట్టడంతో విద్యార్థి కుప్పకూలపోయాడు. నేలపై బోర్లా పడ్డాడు. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పడంతో.. కింద పడిన విద్యార్థిని లేపేందుకు ప్రయత్నించారు. విద్యార్థి అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నాడు. భయాందోళన చెందిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీ జమీల్కు చేరవేశారు.
Read also: Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
వెంటనే హుటా హుటిన బాధిత విద్యార్థిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చేదు వార్త చెప్పారు. విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. అయితే బాధిత తల్లి దండ్రులకు ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి తల్లి, కుటుంబీకులు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కొడుకు మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కథనాలు చెప్పడంతో కోపోద్రోక్తులైన బాధిత విద్యార్థి కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రిన్సిపాల్ తోసహా బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన బాధిత విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా డిచ్పల్లి ఎస్సై గణేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ClassRoom Tragedy : తరగతి గదిలో పురుగుల మందు తాగిన చిన్నారులు
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!