ClassRoom Tragedy : తరగతి గదిలో పురుగుల మందు తాగిన చిన్నారులు
ClassRoom Tragedy : ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఓ వైపు పాఠశాలలో తరగతులు జరుగుతుండగా నాలుగైదు తరగతులు చదువుతున్న ముగ్గురు బాలికలు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిందీ ఘటన.
Read Also: Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
Also Read
నాలుగో తరగతి చదువుతున్న ఆరెప్లల్లి అక్షర (9), సాదు అఖిల (9), ఐదో తరగతి చదువుతున్న సాదు ఐశ్వర్య (10) ఏడుస్తుండడంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని టీచర్ కు చెప్పారు. దీంతో వారు ఎందుకేడుస్తున్నారని ప్రశ్నించగా అక్షర బ్యాగులో ఉన్న తెల్లని డ్రింకును తాగినట్టు చెప్పారు. దీంతో అదేంటని పరిశీలించగా పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు రాజేశ్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వారిని బైక్పై ములుగు ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, బాలిక స్కూలు బ్యాగులోకి పురుగులు మందు ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Read Also: Telangana Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న గవర్నర్
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!