Jagdish Devda : ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
- సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి..
- మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఆపరేషన్ సిందూర్పై మాట్లాడుతూ కామెంట్స్..
Deputy CM: ఇటీవల మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ నేత విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాన్ని మరిచిపోకముందే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీస్ దేవ్డా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సివిల్ డిఫెన్స్లో శిక్షణ కోసం వచ్చిన వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్రమోడీ పాదాలకు నమస్కరించాలి అని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో ఈ వ్యాక్యలు చేశారు. ‘‘పహల్గామ్లో పర్యాటకుల్ని వారి మతం ఆధారంగా వేరు చేయడం, మహిళల్ని పక్కన ఉంచి, పురుషుల్ని కాల్చి చంపడం మనం చూశాము. అప్పటి నుంచి ఈ దేశ ప్రజలు ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చే వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించరు. ఈ రోజు దేశం మొత్తం, సైన్యం ప్రధాని మోడీ తీసుకున్న బలమైన చర్యకు ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. ఆయనకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి’’ అని దేవ్డా అన్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.
దీనికి కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించింది, ఆమెకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సాయుధ బలగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది.
‘‘మన సైనికులు దేషశాన్ని రక్షిస్తారు. రాజకీయ నాయకుల అహంకారాన్ని కాదు. భారత సైన్యం ప్రధాని మోడీ పాదాలకు నమస్కరిస్తారని చెప్పడం దారుణం మాత్రమే కాదు, ఇది మన సాయుధ దళాల త్యాగం, శౌర్యం, గౌరవానికి అవమానం. బీజేపీ నేత జగదీస్ దేవ్డా మాటలు అవమానకరమైనవి’’ అని యూత్ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనేట్ ప్రధాని మోడీ ఆ బీజేపీ నేతను తొలగించాలని కోరారు.
Our soldiers protect the nation — not politicians’ egos.
Saying that the Indian Army bows at the feet of PM Modi is not just outrageous — it’s an insult to the sacrifice, valour, and dignity of our armed forces.
BJP leader Jagdish Devda’s words are disgraceful. pic.twitter.com/ApekeMnkop
— Goa Pradesh Youth Congress (@IYCGoa) May 16, 2025
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?