Medak BRS: మదన్ రెడ్డికే నర్సాపూర్ టిక్కెట్ ఇవ్వాలి.. హరీష్రావ్ ఇంటి వద్ద ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak BRS: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని ఆయన బంధువులు కోరుతున్నారు. హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు ఇంటి ముందు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. మదన్ రెడ్డికి బీఆర్ ఎస్ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని పార్టీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రకటించని నాలుగు స్థానాల్లో నర్సాపూర్ ఒకటి. బీఆర్ఎస్ టికెట్ రాకపోతే రాజీనామా చేస్తానని మదన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే నియోజకవర్గంలోని బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు మదన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెల 21న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. ఈ జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆర్. అయితే నర్సాపూర్ టికెట్ మదన్రెడ్డికి కేటాయించాలని ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హరీశ్రావుకు డిమాండ్ చేశారు. మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి హరీశ్ రావును కలిసేందుకు మదన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 21న 115 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా పెండింగ్లో ఉంది.
Also Read
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
Read also: Jangaon BRS: జనగామలో పొలిటికల్ హీట్.. బీఆర్ఎస్ లో కొనసాగుతున్న టికెట్ వార్..
జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ప్రకటించనుంది. అయితే ఈ సీటు నుంచి మదన్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మెదక్లో నూతన కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో కూడా మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు ఇంటి ముందు మదన్ రెడ్డి బంధువులు ఆందోళన చేస్తూ టికెట్ కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ ను కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందరికంటే ముందుగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ప్రకటించింది.
Hyderabad Metro: అర్థం లేని కొత్త నిబంధనలు.. ప్రయాణికులు ఇబ్బందులు
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!