US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- భారత్లో అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Ambassador: భారత ప్రధాని నరేంద్రమోడీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే నేతల్లో మోడీ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో బలపడుతున్నాయని చెప్పారు. డిసెంబర్లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశం ఉందని, ఆయన ఈ సమావేశానికే పరిమితం కాదని, మోడీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ట్రంప్ మోడీని తన స్నేహితుడిగా భావిస్తారని అన్నారు.
ట్రంప్ వచ్చే ఏడాది భారత్కు మరోసారి వచ్చే అవకాశం ఉందని గోర్ సంకేతాలు ఇచ్చారు. తాను ట్రంప్తో మాట్లాడిన ప్రతీసారి 2020 భారత పర్యటన, మోడీని గుర్తుచేసుకుంటారని అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం అమెరికాకు మంచిదే అని గోర్ అన్నారు. దేశంలో స్థిరత్వం ఉండటం వల్ల భారత్ అమెరికాకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుతోందని చెప్పారు. భారత దేశానికి మోడీ స్థిరత్వాన్ని అందిస్తున్నారని గోర్ అన్నారు.
Also Read
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
భారత్ అమెరికాకు విశ్వసనీయమైన రక్షణ భాగస్వామి అని, ఇరు దేశాల రక్షణ సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలు, విక్రయాలకు మాత్రమే పరిమితం కాలేదని, అమెరికా ప్రపంచంలోని ప్రతీ దేశానికి ఆయుధాలను విక్రయించదని, అమెరికా విశ్వసించే దేశాల్లో భారత్ కూడా ఉందని చెప్పారు. జావెలిన్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్ల సరఫరాలను ఆయన ఉదాహరణలుగా చూపారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్లో మరోసారి భారత పర్యటనకు రానున్నారని గోర్ వెల్లడించారు. రూబియో భారత పర్యటనకు వచ్చిన కొన్ని నెలలకే మళ్లీ రావడం చాలా అరుదుగా ఆయన చెప్పారు. అమెరికా క్యాబినెట్ మంత్రుల పర్యటనలు కూడా ప్లాన్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలోని మూడు పెద్ద రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు రానున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలు, జీ20 సమావేశాలతో పాటు వచ్చే నాలుగు నెలల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మూడు సార్లు అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!