Jangaon BRS: జనగామలో పొలిటికల్ హీట్.. బీఆర్ఎస్ లో కొనసాగుతున్న టికెట్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon BRS: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టికెట్ లపై వార్ షురూ అయ్యింది. టికెట్ పంచాయితీతో జనగామ జిల్లా బీఆర్ ఎస్ లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్ లో టికెట్ వార్ కొనసాగుతుంది. జనగామ బీఆర్ ఎస్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. జనగామలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టికెట్ పంచాయితీపై క్యాడర్ అయోమయంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే ఈసారీ కూడా టికెట్ ఇవ్వాలని జనగామలో ముత్తి రెడ్డి వర్గం ర్యాలీలు, పూజలు నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా టికెట్ పై తీవ్ర లాబీయింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అటు కవితను,ఇటు హరీష్ రావును కలిసి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
Read also: Hyderabad Metro: అర్థం లేని కొత్త నిబంధనలు.. ప్రయాణికులు ఇబ్బందులు
Also Read
జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిపై వివరణ ఇస్తూ కొంత మంది చేసే ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల రాజకీయలను ప్రోత్సహించలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. భావోద్వేగంతో.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి రాజకీయలను ప్రోత్సాహించరని ఆడియో పేరుకున్నారు. మరో వైపు ముత్తిరెడ్డి, పోచంపల్లితో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పళ్ళ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి స్వాగత ర్యాలీలో స్వాగతం పలుకుతూ పల్లాకు జై కొట్టి తమ అభిమానాన్ని చాటారు పల్లా వర్గీయులని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం వేలేరు మండలంలోని సోడశపల్లిలో పల్లా నివాసంలో జనగామకు చెందిన ముఖ్య నాయకులతో పల్లా ప్రత్యేక సమావేశంతో పొలిటికల్ హీట్ పెరిగింది. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మధ్య పోటీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే నియోజకవర్గాల్లో జనగామ ఒకటని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండగా.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ తనకే టిక్కెట్టు అంటున్నారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రగతి భవన్ సమీపంలోని హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. మరుసటి రోజు మల్లాపూర్లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మద్దతుదారులు ప్రదర్శన రూపంలో తరలివచ్చారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!