Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. మోదీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన అనంతరం ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రైలుతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మోడీ చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో పూర్తిగా స్వదేశీ రైళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు మారుతుందనడానికి వందే భారత్ ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇదేనని ఆయన వివరించారు.అతి తక్కువ సమయంలో ఏడు వందల భారతీయ రైళ్లను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఈ రైళ్లలో ఇప్పటికే 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Read also: Governor Tamilisai: ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచండి.. ఇది నా రిక్వెస్ట్
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్యలో తొలి ట్రైన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మోడీకి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రైల్వేస్ కాని, ఏర్వేస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ది జరగలేదన్నారు. కొత్త టెక్నాలజీ తో సికింద్రాబాద్ నుఅభివృద్ధి చేస్తామన్నారు. దీనికి త్వరలో ఫౌండేషన్ ని ప్రధాని మోడీ వేయనున్నారని తెలిపారు.
Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్ఎస్
గవర్నర్ తమిళ సై మాట్లడుతూ.. ఈ కార్య్రమానికి రావడం ఆనందంగా ఉందని, గత 8 ఏళ్లుగా రైల్వే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అనేది కనపడుతోందని తెలిపారు. వ్యాక్సిన్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ట్రైన్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిస్తుందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ట్రైన్స్ సమయం ఆదా అవుతుంది, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపుతుందని ఆశిస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇండియా ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అన్నారు తమిళిసై. అన్ని సెక్టార్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రజల తరపున మోడీకి దన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!