Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. మోదీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన అనంతరం ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రైలుతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మోడీ చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో పూర్తిగా స్వదేశీ రైళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు మారుతుందనడానికి వందే భారత్ ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇదేనని ఆయన వివరించారు.అతి తక్కువ సమయంలో ఏడు వందల భారతీయ రైళ్లను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఈ రైళ్లలో ఇప్పటికే 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Read also: Governor Tamilisai: ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచండి.. ఇది నా రిక్వెస్ట్
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్యలో తొలి ట్రైన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మోడీకి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రైల్వేస్ కాని, ఏర్వేస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ది జరగలేదన్నారు. కొత్త టెక్నాలజీ తో సికింద్రాబాద్ నుఅభివృద్ధి చేస్తామన్నారు. దీనికి త్వరలో ఫౌండేషన్ ని ప్రధాని మోడీ వేయనున్నారని తెలిపారు.
Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్ఎస్
గవర్నర్ తమిళ సై మాట్లడుతూ.. ఈ కార్య్రమానికి రావడం ఆనందంగా ఉందని, గత 8 ఏళ్లుగా రైల్వే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అనేది కనపడుతోందని తెలిపారు. వ్యాక్సిన్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ట్రైన్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిస్తుందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ట్రైన్స్ సమయం ఆదా అవుతుంది, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపుతుందని ఆశిస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇండియా ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అన్నారు తమిళిసై. అన్ని సెక్టార్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రజల తరపున మోడీకి దన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!