Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
Narendra Modi: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. మోదీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన అనంతరం ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రైలుతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మోడీ చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో పూర్తిగా స్వదేశీ రైళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు మారుతుందనడానికి వందే భారత్ ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇదేనని ఆయన వివరించారు.అతి తక్కువ సమయంలో ఏడు వందల భారతీయ రైళ్లను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఈ రైళ్లలో ఇప్పటికే 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Read also: Governor Tamilisai: ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచండి.. ఇది నా రిక్వెస్ట్
Also Read
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్యలో తొలి ట్రైన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మోడీకి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రైల్వేస్ కాని, ఏర్వేస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ది జరగలేదన్నారు. కొత్త టెక్నాలజీ తో సికింద్రాబాద్ నుఅభివృద్ధి చేస్తామన్నారు. దీనికి త్వరలో ఫౌండేషన్ ని ప్రధాని మోడీ వేయనున్నారని తెలిపారు.
Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్ఎస్
గవర్నర్ తమిళ సై మాట్లడుతూ.. ఈ కార్య్రమానికి రావడం ఆనందంగా ఉందని, గత 8 ఏళ్లుగా రైల్వే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అనేది కనపడుతోందని తెలిపారు. వ్యాక్సిన్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ట్రైన్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిస్తుందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ట్రైన్స్ సమయం ఆదా అవుతుంది, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపుతుందని ఆశిస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇండియా ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అన్నారు తమిళిసై. అన్ని సెక్టార్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రజల తరపున మోడీకి దన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
-
LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
-
Super Over Stats: సూపర్ ఓవర్లోని రన్స్, వికెట్లను బ్యాట్స్మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!