KTR: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కేటీఆర్.. విద్యార్థులు వినతి పత్రం
- మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్లిన కేటీఆర్
- విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
- తమ సమస్యలను వినతి పత్రంలో అందించిన విద్యార్థులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ రైతు ధర్నాకు వెళ్తున్న క్రమంలో కేటీఆర్ను ఆపిన యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వినతి పత్రంలో అందించారు. ధర్నా ముగించుకుని వెళ్లే సమయంలో యూనివర్సిటీకి వస్తానని హామీ ఇచ్చిన ఆయన.. హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో యూనివర్సిటీకి చేరుకున్నారు కేటీఆర్. యూనివర్సిటీ బయట విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సమస్యలను, మెస్ ఛార్జీల పెంపు విషయంపై కేటీఆర్కు విద్యార్థులు వినతిపత్రం అందించారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి తమ సమస్యలను తెలుసుకోవాలని విద్యార్థులు కేటీఆర్ను కోరాగా.. లోపలికి వస్తే విద్యార్థులపై కేసులు పెడతారని మరోసారి యూనివర్సిటీకి వస్తానని విద్యార్థులకు చెప్పారు కేటీఆర్.
Read Also: Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
కాగా.. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహించింది. అందులో భాగంగా.. కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. వారి పాలనలో రైతుల కష్టాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇవ్వదని ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి చర్చకు దమ్ముంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లాక్ టవర్ వద్దకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రశ్నించాలంటే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నల్లగొండ ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: CM Chandrababu: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి.. కష్టపడిన వారికే ప్రాధాన్యత!
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!