Nagoba Jatara: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది. ఈజాతర చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. నాగోబా జాతర తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
Read also: Modi Telangana Tour: తెలంగాణలో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గోండు తెగలకు చెందిన మెస్రం వంశస్థులు నిర్వహించే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర గిరిజనుల ఐక్యతను చాటుతుంది. అప్పటి వరకు ఒకరికొకరు పుట్టిన ఆదివాసీ, గోండు, కొలాం, పరదాస్, మెస్రం తెగలు ఈ జాతరలో ఒక్కటవుతారు. జాతరకు వారం రోజుల ముందే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి బండ్లపై ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చేరుకుంటారు. అయితే.. ఈ ప్రయాణం కూడా అత్యంత నిష్టతో ప్రకృతితో మమేకమవుతూ సాగుతుంది. గంగాభిషేకంతో మొదలై.. ప్రజాదర్బార్, బ్యాటింగ్ వంటి ప్రధాన కార్యక్రమాలతో ఈ జాతర జరగనుంది.. ఈరోజు అమావాస్య కావడంతో.. అర్ధరాత్రి పవిత్ర గోదావరి నదీజలాల అభిషేకంతో ఈ జాతర ప్రారంభం కానుంది. ఉదయం పూట మర్రి చెట్ల నుంచి పూజ సామాగ్రిని సేకరిస్తారు. అక్కడి నుంచి మెస్రం వాసులు నాగోబా ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర చూడటానికి రెండు కళ్లు చాలవు.
Read also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ
ఇది చాలా బాగా సాగుతుంది. ఏడు కావడిలో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె వంటి వాటిని ఉంచుకుని 125 గ్రామాల చుట్టూ కాలినడకన తిరుగుతుంటారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పై ఆలయంలో మహాపూజ ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 12 గంటల నుంచి ఏడు గంటలపాటు నిరాటంకంగా సాగే గంగాభిషేకం ఎంతో శోభాయమానంగా సాగింది. మెస్రం ప్రజలు రాత్రంతా నాగదేవతకు పవిత్ర పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు జాతర కొనసాగనుంది. చివరి రోజు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. దీనికి స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర గిరిజన శాఖ మంత్రి, రాష్ట్ర మంత్రులు కూడా నాగోబా దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. ఈ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కొనసాగనుంది.
Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!