Modi Telangana Tour: తెలంగాణలో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Telangana Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు రానున్న ప్రధాని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అయితే.. ఈ నెల 19న ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ రద్దయింది. జనవరి 19వ తేదీన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును సంక్రాంతి సందర్భంగా జనవరి 15న వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు.
Read also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ
Also Read
ఇప్పుడు ఆయన తెలంగాణలో ఫిబ్రవరి 13న పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పీఎంవో ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ, ప్రభుత్వంలోని పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఇప్పటికే ఖరారు కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా త్వరలో రాష్ట్రానికి రానున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
తాజావార్తలు
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..