Munugode bypolls: మునుగోడులో భారీగా నామినేషన్లు.. ఒక్కరోజే వందకుపైగా నామినేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం వంద మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున వందకుపైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. 141 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. శని, ఆదివారాల్లో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
Read Also: Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మునుగోడు ఉపఎన్నికను భావిస్తున్న పార్టీలు… ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పోటీకి నిలిచారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చివరి రోజున నామినేషన్ వేశారు. చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులు 8 మంది నామినేషన్లు వేశారు. 317 జీవోకు సంబంధించిన బాధితులు ఇద్దరు నామినేషన్లు వేశారు. ప్రజా శాంతి పార్టీ తరపున కేఏ పాల్, తెలంగాణ జన సమితి పార్టీ తరపున పల్లె వినయ కుమార్ గౌడ్లు నామినేషన్లు వేశారు. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అప్పుడు చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. ఈనెల 17న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. దీంతో అప్పటివరకు వీరిలో ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారు? ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంది. ఇక వచ్చేనెల 3న ఉపఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!