Dr. Laxman: కేటీఆర్.. ఓ సారి గంగలో మునగండి, పాపాలు పోతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందని లక్ష్మణ్ అన్నారు. బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తా అని అన్నారు.
అభివృద్ధి ఎజెండా, గరీబ్ కళ్యాణ్ ఎజెండాతో ముందుకు వెళతామని ఆయన అన్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయి.. కేటీఆర్ ఓసారి నా వెంట రండి అంటూ ఎద్దేవా చేశారు. మూపీలో రైతులకు 36 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. యూపీలో 5 లక్షల ఉద్యోగాలన భర్తీ చేశారని అన్నారు. బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేకే కేసీఆర్ 80 వేల ఉద్యోగ ప్రకటన చేశారని.. అవి భర్తీ అయ్యేది ఎప్పుడని ప్రశ్నించారు.
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
యోగీ ఆదిత్యనాథ్ కు, కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. బీజేపీ పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చిందని.. ముషీరాబాద్ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శిగా పనిచేశానని..పదవులు రావడం నా గొప్ప కాదని, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అని ఆయన అన్నారు. నాలుగు సార్లు ఓడిపోయినా కుంగిపోలేదని.. నా రాజకీయ ఎదుగుదలకు సహకారం అందించిన ముషీరాబాద్ కార్యకర్తలను మరిచిపోలేనని అన్నారు. బీజేపీ అధిష్టానానికి తెలంగాణ పట్ల క్లారిటీ ఉందని స్పష్టం చేశారు.కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు.
యూపీలో మతకలహాలు లేవని.. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నెల రోజుల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రావడం ట్రైలర్ మాత్రమే అని..ఇన్ ఫ్రెంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఒకటే అని.. కాంగ్రెస్ ను నమ్మితే హోల్ గా టీఆర్ఎస్ వైపు వెళ్తారని అన్నారు. పార్టీలో కొత్త, పాత వ్యత్యాసం లేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఎదగాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రామ మందిర నిర్మాణం మోదీ, యోగీ వల్లే సాధ్యం అయిందన్నారు. కాన్పూర్ లో బుల్డోజర్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణకు బుల్డోజర్ వస్తుందని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు నేనే బుల్డోజర్ తెస్తా అని లక్ష్మణ్ అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!