Dr. Laxman: కేటీఆర్.. ఓ సారి గంగలో మునగండి, పాపాలు పోతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందని లక్ష్మణ్ అన్నారు. బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తా అని అన్నారు.
అభివృద్ధి ఎజెండా, గరీబ్ కళ్యాణ్ ఎజెండాతో ముందుకు వెళతామని ఆయన అన్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయి.. కేటీఆర్ ఓసారి నా వెంట రండి అంటూ ఎద్దేవా చేశారు. మూపీలో రైతులకు 36 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. యూపీలో 5 లక్షల ఉద్యోగాలన భర్తీ చేశారని అన్నారు. బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేకే కేసీఆర్ 80 వేల ఉద్యోగ ప్రకటన చేశారని.. అవి భర్తీ అయ్యేది ఎప్పుడని ప్రశ్నించారు.
Also Read
యోగీ ఆదిత్యనాథ్ కు, కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. బీజేపీ పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చిందని.. ముషీరాబాద్ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శిగా పనిచేశానని..పదవులు రావడం నా గొప్ప కాదని, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అని ఆయన అన్నారు. నాలుగు సార్లు ఓడిపోయినా కుంగిపోలేదని.. నా రాజకీయ ఎదుగుదలకు సహకారం అందించిన ముషీరాబాద్ కార్యకర్తలను మరిచిపోలేనని అన్నారు. బీజేపీ అధిష్టానానికి తెలంగాణ పట్ల క్లారిటీ ఉందని స్పష్టం చేశారు.కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు.
యూపీలో మతకలహాలు లేవని.. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నెల రోజుల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రావడం ట్రైలర్ మాత్రమే అని..ఇన్ ఫ్రెంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఒకటే అని.. కాంగ్రెస్ ను నమ్మితే హోల్ గా టీఆర్ఎస్ వైపు వెళ్తారని అన్నారు. పార్టీలో కొత్త, పాత వ్యత్యాసం లేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఎదగాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రామ మందిర నిర్మాణం మోదీ, యోగీ వల్లే సాధ్యం అయిందన్నారు. కాన్పూర్ లో బుల్డోజర్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణకు బుల్డోజర్ వస్తుందని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు నేనే బుల్డోజర్ తెస్తా అని లక్ష్మణ్ అన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!