Jeevan Reddy: కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు.. అందులో సందేహం లేదు
Jeevan Reddy: కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 1999లో చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం వల్ల కేసిఆర్ తెలంగాణ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. అంతకుముందు కేసిఆర్ తెలంగాణ అంశాన్ని కనీసం పట్టించుకోలేదని మండలిలో జీవన్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో ఏ అంశాలని లేవనెత్తారు.. వాటిని ఎంతవరకు గత ప్రభుత్వం అమలుచేసింది? అని ప్రశ్నించారు. గత పాలకులు నిధులు, నియామకాలు విస్మరించారు. తుమ్మెడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపడుతే అది సుందిళ్ళకు వచ్చేదన్నారు. అలా చేయడం వల్ల మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ గానే ఉందన్నారు. మనకు రావాల్సిన 512tmc లు సీమాంధ్రకు పోయాయని తెలిపారు. 11 క్యూసెక్కుల నీరు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 44 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును.. కేసిఆర్ హయాంలో 88 క్యూసెక్కులకు చేరుకుందన్నారు.
Read also: US Snow Storm: అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్, 1200 విమానాలు రద్దు!
ఇదేనా ఉద్యమ స్పూర్తి…అప్పటి ప్రభుత్వం ఏం చేసింది..? ఇదేనా హక్కుల పరిరక్షణ..? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన చీఫ్ ఇంజనీర్ ను ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లోరినేషన్ 20 కిలోమీటర్ల వరకు మాత్రమే పనికొస్తుందన్నారు. కాళేశ్వరం ఇవాళ నెర్రలు కొట్టిందన్నారు. గత ప్రభుత్వంలో ఇంజనీర్లు ప్రభుత్వం ఏది చెప్తే దానికి సంతకం పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కులను కాలరాశారని మండిపడ్డారు. బొగ్గు లభ్యత ఎక్కడ ఉందో అక్కడ థర్మల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటుచేయాలన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లు కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ లో 4,000 మెగావాట్ల నిర్మాణం చేపడిటే బాగుండేదని అన్నారు. భూమి, నీరు లభ్యత ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ యాదాద్రి ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
Read also: CM Revanth Reddy: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. నేడు సీఎం చేతులమీదుగా నియామక పత్రాలు
మరోవైపు కడియం మాట్లాడుతూ.. ఎంత మేరకు డ్యామేజి అయ్యిందో..ఆ మేరకు కాపర్ డ్యామ్ కట్టండి అన్నారు. విచారణ చేసి..చర్యలు తీసుకోండి అన్నారు. కానీ.. డ్యామేజి పోర్షన్ సెట్ చేయండి అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేసి..పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. . రాజకీయం చేసే వరకు చేశారు.. ప్రజల కోణంలో కూడా ఆలోచన చేయాలన్నారు.
Priyanka Nalkari : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాది తిరక్కుండానే విడాకులు..
తాజావార్తలు
-
MG Majestor: ఎంజీ మెజెస్టర్ విడుదలకు సిద్ధం.. ఫార్చ్యూనర్కు గట్టి పోటీ!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!
-
Mercedes Buried: అదృష్టం కోసం ‘8888’ నంబర్ ప్లేట్.. మృతదేహంతో పాటు రూ.1.5 కోట్ల బెంజ్ కారును పాతిపెట్టిన ఫ్యామిలీ!
-
Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!