MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
MLA Seethakka Demands KTR To Take A Word Back: ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను గెలిపించి తప్పు చేశారంటూ మంత్రి కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని.. ఆయన ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తనని ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు ఓసారి ఆలోచించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని MLA- క్యాంప్ కార్యాలయం వద్ద నిర్హించిన ప్రెస్మీట్లో సీతక్క మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కేటీఆర్ కూడా పని చేశారని, అప్పుడు మిమ్మల్ని గెలిపించి ప్రజలు తప్పు చేశారని ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ అన్నదా? అని ప్రశ్నించారు. మమ్మల్ని గెలిపించి తప్పు చేశారని అంటే.. మిమ్మల్ని గెలిపించి కూడా ప్రజలు తప్పు చేసినట్టేనని మేము అన్నామా? అని అడిగారు.
Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
నియోజకవర్గ ప్రజలే తన బలం, కుటుంబమని భావించి తాను పని చేస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లు తన గడప తొక్కినా.. ఎవరు ఫోన్ చేసినా.. తాను అందరినీ ఒకేలా చూస్తున్నానని అన్నారు. ఎప్పుడు ప్రజల్లో తిరగనివాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో, మీ అభ్యర్థులమనే రూపంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని చురకలంటించారు. గంగిరెద్దుల్లాగా ఎవరు వస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసని కౌంటర్ వేశారు. ఏనాడూ జిల్లా పర్యటనలు పెట్టని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పర్యటనలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవి మీకే తగులుతాయని.. మాకు తగలవని శాపం పెట్టారు. కాబట్టి.. కేటీఆర్ ఆ మాటని వెనక్కి తీసుకోవాలని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అవసరం కోసం ప్రజల్లోకి వచ్చి, మొఖం చూపించిపోయే వాళ్లను గెలిపించుకోవాలనే మీ కుట్రలు, కుతంత్రాలు.. ములుగు నియోజకవర్గ ప్రజలు సహించరన్నారు.
MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తనని టార్గెట్ చేశారని, ఏ రకంగా ఇబ్బందులు పెట్టదలచుకున్నారో తాను ప్రశ్నిస్తున్నానని సీతక్క విరుచుకుపడ్డారు. తమని ఎవరెన్ని తిట్టినా.. వినతి పత్రాల్లో ములుగు నియోజకవర్గానికి తాము అడిగిన డిమాండ్లను పూర్తి చేయాలని అడుగుతున్నామన్నారు. గోదావరి జలాలు, ఏటూరునాగారాన్ని రెవిన్యూ డివిజన్, మంగపేట ప్రాంతంలో ఓ బీఈడీ కాలేజీ, పెసర కేంద్రంగా నర్సింగ్ కాలేజీ వంటి డిమాండ్లను పూర్తి చేయాలన్నారు. అలాగే.. ములుగులో ప్రకటించిన మెడికల్ కాలేజీని వెంటనే ప్రారంభించాలని, ట్రైబల్ యూనివర్సిటీ తరగతుల్ని త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలన్నారు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!