MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Demands KTR To Take A Word Back: ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను గెలిపించి తప్పు చేశారంటూ మంత్రి కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని.. ఆయన ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తనని ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు ఓసారి ఆలోచించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని MLA- క్యాంప్ కార్యాలయం వద్ద నిర్హించిన ప్రెస్మీట్లో సీతక్క మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కేటీఆర్ కూడా పని చేశారని, అప్పుడు మిమ్మల్ని గెలిపించి ప్రజలు తప్పు చేశారని ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ అన్నదా? అని ప్రశ్నించారు. మమ్మల్ని గెలిపించి తప్పు చేశారని అంటే.. మిమ్మల్ని గెలిపించి కూడా ప్రజలు తప్పు చేసినట్టేనని మేము అన్నామా? అని అడిగారు.
Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
Also Read
నియోజకవర్గ ప్రజలే తన బలం, కుటుంబమని భావించి తాను పని చేస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లు తన గడప తొక్కినా.. ఎవరు ఫోన్ చేసినా.. తాను అందరినీ ఒకేలా చూస్తున్నానని అన్నారు. ఎప్పుడు ప్రజల్లో తిరగనివాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో, మీ అభ్యర్థులమనే రూపంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని చురకలంటించారు. గంగిరెద్దుల్లాగా ఎవరు వస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసని కౌంటర్ వేశారు. ఏనాడూ జిల్లా పర్యటనలు పెట్టని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పర్యటనలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవి మీకే తగులుతాయని.. మాకు తగలవని శాపం పెట్టారు. కాబట్టి.. కేటీఆర్ ఆ మాటని వెనక్కి తీసుకోవాలని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అవసరం కోసం ప్రజల్లోకి వచ్చి, మొఖం చూపించిపోయే వాళ్లను గెలిపించుకోవాలనే మీ కుట్రలు, కుతంత్రాలు.. ములుగు నియోజకవర్గ ప్రజలు సహించరన్నారు.
MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తనని టార్గెట్ చేశారని, ఏ రకంగా ఇబ్బందులు పెట్టదలచుకున్నారో తాను ప్రశ్నిస్తున్నానని సీతక్క విరుచుకుపడ్డారు. తమని ఎవరెన్ని తిట్టినా.. వినతి పత్రాల్లో ములుగు నియోజకవర్గానికి తాము అడిగిన డిమాండ్లను పూర్తి చేయాలని అడుగుతున్నామన్నారు. గోదావరి జలాలు, ఏటూరునాగారాన్ని రెవిన్యూ డివిజన్, మంగపేట ప్రాంతంలో ఓ బీఈడీ కాలేజీ, పెసర కేంద్రంగా నర్సింగ్ కాలేజీ వంటి డిమాండ్లను పూర్తి చేయాలన్నారు. అలాగే.. ములుగులో ప్రకటించిన మెడికల్ కాలేజీని వెంటనే ప్రారంభించాలని, ట్రైబల్ యూనివర్సిటీ తరగతుల్ని త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!