MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Demands KTR To Take A Word Back: ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను గెలిపించి తప్పు చేశారంటూ మంత్రి కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని.. ఆయన ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తనని ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు ఓసారి ఆలోచించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని MLA- క్యాంప్ కార్యాలయం వద్ద నిర్హించిన ప్రెస్మీట్లో సీతక్క మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కేటీఆర్ కూడా పని చేశారని, అప్పుడు మిమ్మల్ని గెలిపించి ప్రజలు తప్పు చేశారని ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ అన్నదా? అని ప్రశ్నించారు. మమ్మల్ని గెలిపించి తప్పు చేశారని అంటే.. మిమ్మల్ని గెలిపించి కూడా ప్రజలు తప్పు చేసినట్టేనని మేము అన్నామా? అని అడిగారు.
Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
నియోజకవర్గ ప్రజలే తన బలం, కుటుంబమని భావించి తాను పని చేస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లు తన గడప తొక్కినా.. ఎవరు ఫోన్ చేసినా.. తాను అందరినీ ఒకేలా చూస్తున్నానని అన్నారు. ఎప్పుడు ప్రజల్లో తిరగనివాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో, మీ అభ్యర్థులమనే రూపంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని చురకలంటించారు. గంగిరెద్దుల్లాగా ఎవరు వస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసని కౌంటర్ వేశారు. ఏనాడూ జిల్లా పర్యటనలు పెట్టని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పర్యటనలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అవి మీకే తగులుతాయని.. మాకు తగలవని శాపం పెట్టారు. కాబట్టి.. కేటీఆర్ ఆ మాటని వెనక్కి తీసుకోవాలని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అవసరం కోసం ప్రజల్లోకి వచ్చి, మొఖం చూపించిపోయే వాళ్లను గెలిపించుకోవాలనే మీ కుట్రలు, కుతంత్రాలు.. ములుగు నియోజకవర్గ ప్రజలు సహించరన్నారు.
MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తనని టార్గెట్ చేశారని, ఏ రకంగా ఇబ్బందులు పెట్టదలచుకున్నారో తాను ప్రశ్నిస్తున్నానని సీతక్క విరుచుకుపడ్డారు. తమని ఎవరెన్ని తిట్టినా.. వినతి పత్రాల్లో ములుగు నియోజకవర్గానికి తాము అడిగిన డిమాండ్లను పూర్తి చేయాలని అడుగుతున్నామన్నారు. గోదావరి జలాలు, ఏటూరునాగారాన్ని రెవిన్యూ డివిజన్, మంగపేట ప్రాంతంలో ఓ బీఈడీ కాలేజీ, పెసర కేంద్రంగా నర్సింగ్ కాలేజీ వంటి డిమాండ్లను పూర్తి చేయాలన్నారు. అలాగే.. ములుగులో ప్రకటించిన మెడికల్ కాలేజీని వెంటనే ప్రారంభించాలని, ట్రైబల్ యూనివర్సిటీ తరగతుల్ని త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!