MLA Rajaiah: కడియం శ్రీహరి ఎన్కౌంటర్ల సృష్టికర్త.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajaiah Controversial Comments On Kadiyam Srihari: ఎమ్మెల్యే టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్కౌంటర్ల సృష్టికర్త అని, ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కుండబద్దలు కొట్టారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
Flipkart: గుడ్న్యూస్ చెప్పిన ఫ్లిప్కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
ఎంపీలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి రావాలని.. కానీ కడియం శ్రీహరి మాత్రం 2014 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని రాజయ్య మండిపడ్డారు. 2014 -18 ఎన్నికల సమయంలో తాను తన ఆస్తులు మొత్తం అమ్ముకున్నానన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు అతని ఆస్తులు ఎంతో, ఇప్పుడు ఎంతో చూడాలని అన్నారు. తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా, ఏనాడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు.. కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు సైతం ఏనాడూ హాజరు కారని చెప్పారు.
Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగా జరిగాయని.. నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. దళితులందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని, నియోజకవర్గంలో గొప్పగా పని చేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ.. ఇంటింటికీ తిరుగుతానన్నారు. కేసీఆర్ తనని తప్పకుండా పిలిపించుకుంటారని, గ్లోబెల్స్ ప్రచారం చేసేవాళ్ల మాటలు నమ్మొద్దని రాజయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!