Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
Madhu Yaskhi Goud Sensational Comments On BRS Party, CM KCR & KTR: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది అయితే.. భోగం మాత్రం బీఆర్ఎస్ పార్టీది అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయే తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదని పేర్కొన్నారు. గాంధీ భవన్లో మధుయాష్కీ మాట్లాడుతూ.. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఒక్కసారి గాంధీ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాసేవలో భాగంగా ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ సభ్యుడైన రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు.
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
Also Read
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు భాయి భాయి అని.. తెలంగాణలో ఆ రెండూ పార్టీలే ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్లో ఉన్నా.. అరెస్ట్ చేయలేని స్నేహం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది అని యధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అమలవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం.. కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. అమరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించారని, రైతులను రైతు బంధు అంటూ బందిపోటు దొంగలా వ్యవహారిస్తున్న కేసీఆర్ను తాము బొందపెడతామని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆధారాలతో రావాలని.. తాము చర్చలకు సిద్ధమని సవాల్ విసిరారు.
Bandi Sanjay: చరిత్ర సృష్టించేలా మోడీ సభని సక్సెస్ చేద్దాం.. ఆ దుష్ప్రచారాల్ని తిప్పికొడదాం
గాడ్సేను పూజించే బీజేపీ పార్టీకి తొత్తుగా మారిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు గాంధీజీ గురించి మాట్లాడే హక్కు లేదని మధుయాష్కీ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ల ఆశయాలను సీఎం కేసీఆర్, కేటీఆర్లు పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, నాయకులపై చులకనగా మాట్లాడితే.. చురకలు పెట్టె సమయం కేటీఆర్కు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?