MLA Anirudh Reddy : కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..
- సొంత ఊరిలో కాంగ్రెస్ ఓటమిపై ఎమ్మెల్యే స్పందన
- బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు ఆరోపణ
- అభ్యర్థుల ఎంపికలో లోపాల స్వీకారం
- రెండో విడతకు కాంగ్రెస్ సిద్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Anirudh Reddy : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు వేస్తారని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థి గత రెండు ఎన్నికల్లో కూడా ఓటమిపాలవడం, ఈసారి ఆ వ్యక్తికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఓటమికి స్వయం విమర్శ చేసుకుంటూ, తాను ఇతర గ్రామాల ఇష్యూస్లో ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, సొంత ఊరే కదా సపోర్ట్ చేస్తారులే అనుకొని కొంచెం నిర్లక్ష్యం జరిగిందేమోనని అనుకుంటున్నానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
రాజాపూర్, నవాబ్పేట మండలాల్లోని స్థానిక ఎన్నికల ఫలితాలపై వచ్చిన విమర్శలకు ఆయన బదులిచ్చారు. నవాబ్పేట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులు 50 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారని తెలిపారు. చాలా గ్రామాల్లో BRS అసలు అభ్యర్థులనే నిలబెట్టలేదని, గతంలో ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థులను BRS వెనుక ఉండి నడిపించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, సర్పంచ్ ఎన్నికలలో ఎవరైనా గెలవవచ్చు అని తాను స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కొన్నిచోట్ల కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నిలబడటం వల్ల కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని, అయితే ఓవరాల్గా కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించిందని నొక్కి చెప్పారు.
రెండో విడత ఎన్నికల కోసం తమ పార్టీ సిద్ధమవుతున్నట్లు అనిరుధ్ రెడ్డి తెలిపారు. మొదటి విడతలో జరిగిన మిస్టేక్స్, ముఖ్యంగా ఒకే స్థానంలో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడటం వంటి లోపాలు రెండో, మూడో విడతల్లో జరగకుండా చూస్తామని, దీని కోసం ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. చివరగా, “గెలిచిన వాళ్లంతా మా వాళ్లే, ఓడిన వాళ్లు కూడా మా వాళ్లే. అన్ని గ్రామాలు నావే” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.
CM Chandrababu: టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు.. 25 వేల మందికి ఉద్యోగాలు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?