Shocking: మూడు ముక్కలుగా శరీరం.. వేర్వేరు ప్రాంతాల్లో సంచుల్లో పారవేత
- శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసిన దుండగులు
- ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు
- మూడు రోజుల క్రితం హత్య చేసినట్లుగా అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేశారు. నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పాడుబడిన బావిలో పడేరేశారు. తల, చేతులు మరో ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. మురికి కాలువలో విసిరేశారు. ఛాతి భాగం ఎక్కడ ఉందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వ్యక్తిని చంపింది ఎవరు..? హత్యకు గురైంది ఎవరు.. ? కామారెడ్డి జిల్లాలో ఒళ్లు గగ్గుర్పొడిచేలా.. వ్యక్తి హత్య మిస్టరీగా మిగిలింది. కొత్త తరహా హత్య వెనుక అసలేం జరిగింది? ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి.. శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసి.. ప్లాస్టిక్ సంచిలో కుక్కి శరీర భాగాలను కామారెడ్డిలోని ఆయా ప్రాంతాల్లో పారేసినట్లు.. పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంలో.. ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు. దాని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు రోజుల క్రితం హత్య చేసి.. మృతదేహాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు…
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
ఐతే హత్యకు గురైంది ఎవరు? కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని జిల్లా ప్రజలు చెబుతున్నారు. కొత్త తరహాలో మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి మురికి కాలువలో.. పాడుబడ్డ బావిలో పారేయడం వెనుక కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.. మూడు రోజుల క్రితం నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. ఓ పాడు బడిన బావిలో పారేయగా.. మూడు రోజుల తరువాత ఆ పాడుబడిన బావికి సమీపంలోని ఓ మురికి కాలువలో .. మరో ప్లాస్టిక్ సంచిలో తల రెండు చేతులు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం లభించిన మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారింది. ఛాతీ భాగం ఇంకా లభ్యం కాలేదు. మిగతా శరీర భాగం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపపట్టారు…
కామారెడ్డిలో ఈ తరహా .. మృతదేహం శరీర భాగాలు లభ్యం కావడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు. హత్యలు జరిగినా.. ఇంత కిరాతకంగా ముక్కలు చేసి.. శరీర భాగాలను సంచిలో కుక్కిన ఘటనలు ఇది వరకు లేవని చెబుతున్నారు.. మొత్తానికి కామారెడ్డిలో మూడు ముక్కలుగా మారిన మృతదేహం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు ఇప్పటికైతే మిస్టరీగానే మిగిలింది. సీసీ కెమెరాల ఆధారాంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే హత్య మిస్టరీ ఛేదిస్తామని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!