Shocking: మూడు ముక్కలుగా శరీరం.. వేర్వేరు ప్రాంతాల్లో సంచుల్లో పారవేత
- శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసిన దుండగులు
- ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు
- మూడు రోజుల క్రితం హత్య చేసినట్లుగా అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేశారు. నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పాడుబడిన బావిలో పడేరేశారు. తల, చేతులు మరో ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. మురికి కాలువలో విసిరేశారు. ఛాతి భాగం ఎక్కడ ఉందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వ్యక్తిని చంపింది ఎవరు..? హత్యకు గురైంది ఎవరు.. ? కామారెడ్డి జిల్లాలో ఒళ్లు గగ్గుర్పొడిచేలా.. వ్యక్తి హత్య మిస్టరీగా మిగిలింది. కొత్త తరహా హత్య వెనుక అసలేం జరిగింది? ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి.. శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసి.. ప్లాస్టిక్ సంచిలో కుక్కి శరీర భాగాలను కామారెడ్డిలోని ఆయా ప్రాంతాల్లో పారేసినట్లు.. పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంలో.. ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు. దాని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు రోజుల క్రితం హత్య చేసి.. మృతదేహాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు…
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఐతే హత్యకు గురైంది ఎవరు? కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని జిల్లా ప్రజలు చెబుతున్నారు. కొత్త తరహాలో మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి మురికి కాలువలో.. పాడుబడ్డ బావిలో పారేయడం వెనుక కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.. మూడు రోజుల క్రితం నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. ఓ పాడు బడిన బావిలో పారేయగా.. మూడు రోజుల తరువాత ఆ పాడుబడిన బావికి సమీపంలోని ఓ మురికి కాలువలో .. మరో ప్లాస్టిక్ సంచిలో తల రెండు చేతులు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం లభించిన మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారింది. ఛాతీ భాగం ఇంకా లభ్యం కాలేదు. మిగతా శరీర భాగం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపపట్టారు…
కామారెడ్డిలో ఈ తరహా .. మృతదేహం శరీర భాగాలు లభ్యం కావడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు. హత్యలు జరిగినా.. ఇంత కిరాతకంగా ముక్కలు చేసి.. శరీర భాగాలను సంచిలో కుక్కిన ఘటనలు ఇది వరకు లేవని చెబుతున్నారు.. మొత్తానికి కామారెడ్డిలో మూడు ముక్కలుగా మారిన మృతదేహం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు ఇప్పటికైతే మిస్టరీగానే మిగిలింది. సీసీ కెమెరాల ఆధారాంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే హత్య మిస్టరీ ఛేదిస్తామని చెబుతున్నారు..
తాజావార్తలు
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!