Shocking: మూడు ముక్కలుగా శరీరం.. వేర్వేరు ప్రాంతాల్లో సంచుల్లో పారవేత
- శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసిన దుండగులు
- ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు
- మూడు రోజుల క్రితం హత్య చేసినట్లుగా అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేశారు. నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పాడుబడిన బావిలో పడేరేశారు. తల, చేతులు మరో ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. మురికి కాలువలో విసిరేశారు. ఛాతి భాగం ఎక్కడ ఉందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వ్యక్తిని చంపింది ఎవరు..? హత్యకు గురైంది ఎవరు.. ? కామారెడ్డి జిల్లాలో ఒళ్లు గగ్గుర్పొడిచేలా.. వ్యక్తి హత్య మిస్టరీగా మిగిలింది. కొత్త తరహా హత్య వెనుక అసలేం జరిగింది? ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి.. శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసి.. ప్లాస్టిక్ సంచిలో కుక్కి శరీర భాగాలను కామారెడ్డిలోని ఆయా ప్రాంతాల్లో పారేసినట్లు.. పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంలో.. ఛాతీ భాగం ఇంకా కనిపించడం లేదు. దాని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు రోజుల క్రితం హత్య చేసి.. మృతదేహాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు…
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఐతే హత్యకు గురైంది ఎవరు? కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని జిల్లా ప్రజలు చెబుతున్నారు. కొత్త తరహాలో మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి మురికి కాలువలో.. పాడుబడ్డ బావిలో పారేయడం వెనుక కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.. మూడు రోజుల క్రితం నడుము, కాళ్లు ఓ ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. ఓ పాడు బడిన బావిలో పారేయగా.. మూడు రోజుల తరువాత ఆ పాడుబడిన బావికి సమీపంలోని ఓ మురికి కాలువలో .. మరో ప్లాస్టిక్ సంచిలో తల రెండు చేతులు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం లభించిన మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారింది. ఛాతీ భాగం ఇంకా లభ్యం కాలేదు. మిగతా శరీర భాగం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపపట్టారు…
కామారెడ్డిలో ఈ తరహా .. మృతదేహం శరీర భాగాలు లభ్యం కావడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు. హత్యలు జరిగినా.. ఇంత కిరాతకంగా ముక్కలు చేసి.. శరీర భాగాలను సంచిలో కుక్కిన ఘటనలు ఇది వరకు లేవని చెబుతున్నారు.. మొత్తానికి కామారెడ్డిలో మూడు ముక్కలుగా మారిన మృతదేహం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు ఇప్పటికైతే మిస్టరీగానే మిగిలింది. సీసీ కెమెరాల ఆధారాంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే హత్య మిస్టరీ ఛేదిస్తామని చెబుతున్నారు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..