WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!
- ఢిల్లీ భారీ స్కోర్ 203 పరుగులు
- మంధాన–వోల్ 165 పరుగుల భాగస్వామ్యం
- 41 బంతుల్లో 87తో మంధాన విధ్వంసం
- 19.4 ఓవర్లలో టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ
వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లోనే 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పటిష్టమైన పునాది వేయగా, ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ 44 పరుగులు, చినెల్ హెన్రీ మెరుపు వేగంతో 35 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే , నడైన్ డిక్లార్క్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ పడగొట్టారు.
Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
అయితే, 204 పరుగుల సునాయాసంగా లేని లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోవడంతో కొంత ఆందోళన కలిగింది. కానీ, ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన , జార్జియా వోల్ కలిసి విధ్వంసాన్ని సృష్టించారు. స్మృతి మంధాన కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్ల ఆశలను నీరుగార్చగా, మరోవైపు జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేసింది. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. మైదానంలోని ప్రతి మూలకు బౌండరీల వర్షం కురిపిస్తూ వడోదర స్టేడియాన్ని హోరెత్తించారు.
మ్యాచ్ ముగింపు దశలో వోల్, రిచా ఘోష్ , మంధాన వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఢిల్లీ మళ్ళీ పోరాటంలోకి వచ్చినట్టు అనిపించినా, అదృష్టం మాత్రం ఆర్సీబీ పక్షానే నిలిచింది. ముఖ్యంగా 19వ ఓవర్లో మిన్ను మణి ఒక సులభమైన క్యాచ్ను చేజార్చడం ఢిల్లీ విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా, ఒత్తిడిని అధిగమించిన రాధా యాదవ్ వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు బాది 19.4 ఓవర్లలోనే జట్టును విజేతగా నిలిపింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరి రన్నరప్గా మిగిలిపోవాల్సి రావడం గమనార్హం. ఆర్సీబీ తన నిలకడైన ఆటతీరుతో మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుని తన అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!