111 GO: జీవో ప్రకటనపై ఎవరేమన్నరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు జరుగుతుందని, టీఆర్ఎస్ నేతలకు మేలు చేయడం కోసమే జీవో ఎత్తి వేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చాలా మందికి అక్కడ ల్యాండ్ ఉందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తే విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. 111 జీవో పై లేనిపోని విమర్శలు చేస్తే దాని పరిధిలో ఉన్న వివరాలు సేకరిస్తామని, ఇది ఎప్పటి నుండో దాదాపు 84 గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలు అడుగుతున్న సమస్య అని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందిస్తూ.. 111 జీవో ఎత్తి వేస్తా అని సీఎం చెప్పడం నీ స్వాగతిస్తున్నామన్నారు. మంచి నిర్ణయం.. వైఎస్ హయాంలోనే కమిటీ వేశారు. కోర్టు లో పిటిషన్ పడటంతో ఆగిపోయిందని ఆయన వెల్లడించారు. 111 జీవో ఎత్తెస్తే… రైతులు అదృష్టవంతులు అని, అక్కడి చెరువులకు ఇబ్బంది లేకుండా 111 జీవో ఎత్తి వేస్తే సరిపోతుందన్నారు. చెరువులకు ముప్పు లేదని సీఎం చెప్తున్నా… వాటికి నీళ్ళు కూడా వచ్చేలా చూడటం మంచిదన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి 111 జీవో ప్రకటనపై మాట్లాడుతూ.. జీవో 111 ఎత్తివేత ప్రకటన.. అదరా బాదరా ప్రకటన సరికాదని ఆయన మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేయాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 111 జీఓ పరిధిలో ఉన్న గ్రామాల పరిధి తగ్గించండి అప్పుడు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే బడా బాబులా చేతిలోకి 111 జీవో భూములు వెళ్ళాయని, పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ అనుమతులు రావడం కష్టమన్నారు. సీఎం ఉన్నత స్థాయి కమిటీ వేసి చర్చించాలని, లేదంటే రైతులు నష్టపోతారు… రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభ పడతారని ఆయన హితవు పలికారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..