Minister KTR: మరో 43 మెట్ల బావుల్ని ఆధునీకరిస్తాం.. కేటీఆర్ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Talks About Another 43 Step Well Development: హైదరాబాద్లోని బన్సీలాల్పేట మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో 43 మెట్ల బావులను ఆధునీకరిస్తామని మేయర్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక బన్సీలాల్ మెట్ల బావి గురించి మాట్లాడుతూ.. గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి, ఈ మెట్ల బావికి కొత్త వైభవాన్ని అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు. టన్నుల కొద్ది చెత్తను స్వహస్తాలతో తీసి, ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్కు అందించిన పారిశుద్ధ కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని కేటీఆర్ సూచించారు. చెత్త పారేయకుండా.. ఈ బావిని సంరక్షించుకునే బాధ్యత స్థానికులదేనని అన్నారు. మెట్ల బావిని కాపాడుకుంటూ.. హైదరాబాద్ నగరానికి స్ఫూర్తిగా నిలవాలని స్థానికులకు పిలుపునిచ్చారు. ఈ మెట్ల బావి నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 25 సార్లు పరివీలించారని, ఎంతో కష్టపడి దీనిని పునరుద్ధరించామని తలసాని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బావిని పునరుద్ధరించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని.. 3,900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి, 863 ట్రిపుల్లో లారీల్లో ఆ చెత్తను తలరించారన్నారు. మొత్తం రూ. 10 కోట్ల వ్యయంతో ఈ బావిని సుందరీకరించారన్నారు. భవిష్యత్ తరాలు గుర్తించుకునే విధంగా ఆధునీకరించిన ఈ బావిని.. నీరు ఉబికి వచ్చేలా, పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
Also Read
ఈ ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఇతర పనులు ప్రారంభించుకున్నామని కేటీఆర్ అన్నారు. కానీ.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుందని, ఈ మెట్ల బావి పునరిద్ధరించుకోవడం అందులో ఒక సందర్భమని పేర్కొన్నారు. నగరం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే.. భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లవుతామని పేర్కొన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీకుతుబ్షాహీ టూంబ్స్ వద్ద కూడా ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు ఆధునీకరించారన్నారు. అదే విధంగా మొజాం జాహీ మార్కెట్, మీరాలం మండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్ పేట్ సరాయి మొదలైన వాటిని అద్భుతంగా ఆధునీకరించి.. హైదరాబాద్ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా గుర్తింపు తెస్తామని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!