Minister KTR: ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్.. నిర్మాణానికి భూమిపూజ చేసిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తలసరి ఆదాయంతో పాటు అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో.. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని విమర్శించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అధిగమించాయని చెప్పారు. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని అన్నారు. హైదరాబాద్లోని మలక్పేటలో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి దేశానికి నిదర్శనం అన్నారు.హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. పాతబస్తీకి మెట్రో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మూసీ ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో గతంలో తరుచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. మలక్ పేట అంటే చిన్నప్పుడు టీవీ టవర్ అని, రానున్న రోజుల్లో మలక్ పేట అంటే ఐటీ టవర్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 44.20 ఎకరాల్లో ఐటీ టవర్ను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ మొదటి దశగా రూ.1,032 కోట్లతో 10.35 ఎకరాల్లో 21 అంతస్తులు, 20 లక్షల చదరపు అడుగులతో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 36 నెలల్లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, అడోబ్ లాంటి పెద్ద కంపెనీలను ఇక్కడికి తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకుపోతోందన్నారు. బెంగళూరు కంటే ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
Postal Department: డెలివరీ సమయంలో పార్శిల్ ట్యాంపరింగ్.. పోస్టల్ శాఖకు రూ.20 వేల ఫైన్
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!