Postal Department: డెలివరీ సమయంలో పార్శిల్ ట్యాంపరింగ్.. పోస్టల్ శాఖకు రూ.20 వేల ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postal Department: హైదరాబాద్ జిల్లా వినియోగదారులకు ఫోరం పోస్టల్ శాఖ షాక్ ఇచ్చింది. పార్శిల్ తారుమారు చేసి అందులోని వస్తువులు మాయమైన ఘటనపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం కోర్టు.. పోస్టల్ శాఖకు జరిమానా విధించింది. కస్టమర్ కు రూ.20 వేలు పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్ ను ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ గతేడాది ఇండియా పోస్ట్ ద్వారా చీరలు, బెడ్ షీట్లు, షర్టులు, ప్యాంట్లు, మెడికల్ బుక్స్, ప్లాస్టిక్ కంటైనర్లతో కూడిన నాలుగు ప్యాకెట్లను హరిద్వార్ కు పంపారు. అయితే అతడు పంపిన సరుకులు ఆర్డర్ చేసిన చోటికి వెళ్లగా రూ.20 వేల విలువైన పది చీరలు మాయమయ్యాయి. తాను పంపిన ప్యాకెట్లను ఇండియా పోస్ట్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారని ఆరోపిస్తూ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది.
అయితే.. వీకే సింగ్ ఫిర్యాదును ఇండియా పోస్ట్ తోసిపుచ్చింది. సరుకులు సక్రమంగానే పంపామని, ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. సరుకులు పంపేటప్పుడు వాటి విలువను ప్రకటించలేదని, ఇన్సూరెన్స్ చేయలేదని చెప్పింది. ఇండియా పోస్ట్ వాదనతో ఫిర్యాదుదారు VK సింగ్ ఏకీభవించలేదు. పార్శిళ్లు పంపుతుండగా వీడియో తీశానని.. డెలివరీ అయిన తర్వాత వీడియో కూడా తీశానని.. ఆ రెండు వీడియోల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. ఈ మేరకు ఆ వీడియోలను వినియోగదారుల ఫోరంకు అందజేశారు. గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఫిర్యాదుదారు వాదనతో ఏకీభవించిన వినియోగదారుల ఫోరం.. పంపిణీ సమయంలో సరుకులు పోతే తపాలా శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు రూ. 20 వేలు నష్టపరిహారం, ఫిర్యాదు ఖర్చుల కింద మరో 5 వేలు చెల్లించాలని పోస్టల్ శాఖను ఆదేశించింది.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
మరోవైపు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.. మెట్రో స్టేషన్లో రూ. 10. అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది. మెట్రో రైల్వే స్టేషన్లో ఒకవైపు నుంచి మరో వైపుకు ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10ని వాపసు ఇవ్వాలని మెట్రో సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే..
Talasani: దేశంలో ఇలాంటి ఇల్లు చూపించండి.. రాజీనామా చేస్తా..!
తాజావార్తలు
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!