Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haribabu Murder Case: హరిబాబు హత్యకేసు నిందితుడు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్ను రిమాండ్కు తరలించారు. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే హరిబాబును సంతోష్ హత్య చేసినట్లు తెలిపారు. “ఈ నెల 17న నిజామాబాద్ లోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద హత్య జరిగింది. తల్లి, బంధువుల సహకారంతో హరిబాబును సంతోష్ హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు, కారును స్వాధీనం చేసుకున్నాం. హత్యలో మిగతా నలుగురి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సంతోష్తో పాటు అతడి తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ నేరాన్ని ప్రోత్సహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.” అని వివరించారు. అయితే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను సీపీ వివరించారు. హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోష్ ఆంధ్రాకు పారిపోయేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అతడిని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే బెయిల్పై బయటకి వచ్చిన హరిబాబు నిజామాబాద్లో ఉంటున్నట్లు తెలుసుకున్న నిందితులు పక్కా ప్లాన్తో మర్డర్ చేశారని తెలిపారు.
అసలు ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు.. తన భార్య వైష్ణవి (19)ని ప్రేమవివాహం చేసుకున్నాడు. కానీ.. మార్చి 17న ఆమె 4 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రెండ్రోజుల తర్వాత అరెస్టయి, ఆగస్టు 15న బెయిల్పై విడుదలైన హరిబాబు ప్రాణభయంతో అనంతపురంలో గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బెయిల్పై బయటకొచ్చిన అతని తల్లి లక్ష్మి నిజామాబాద్లోని ఇంద్రాపూర్ కాలనీలో అద్దెకుంటూ రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మొక్కజొన్నలు విక్రయిస్తోంది. తల్లిని చూడటానికి నిజామాబాద్ వచ్చిన హరిబాబు, గురువారం (సెప్టెంబర్ 17న) సాయంత్రం పానీపూరి బండి వద్ద నీళ్లు తాగుతుండగా వైష్ణవి సోదరుడు సంతోష్ కారులో వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే తల, మెడ, నడుము భాగాల్లో 9 సార్లు కత్తితో దారుణంగా నరకడంతో హరిబాబు తీవ్ర రక్తస్రావమై తల్లి కళ్లముందే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ భయానక హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డై తీవ్ర వైరల్గా మారాయి. కళ్లెదుటే కొడుకును నరికి చంపడంతో తల్లి లక్ష్మి తీవ్ర షాక్లోకి వెళ్లిపోవడమే కాకుండా ప్రాణభయంతో వణికిపోతోంది. మార్చి 17న భర్త చేతిలో వైష్ణవి దారుణ హత్యకు గురైతే, సరిగ్గా ఆరు నెలల తర్వాత సెప్టెంబర్ 17న వైష్ణవి సోదరుడి చేతిలోనే హరిబాబు హత్యకు గురికావడం గమనార్హం.
Also Read
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!