Minister KTR: కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణ అభివృద్ధిని ఆపలేరు
Minister KTR Satirical Tweets On Central Government: ఫార్మా & వ్యాక్సిన్ క్యాపిటల్ అయినప్పటికీ.. తెలంగాణకు డ్రగ్ పార్క్ను కేటాయించలేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తెలంగాణ ప్రగతి చక్రానికి ఎన్ని ఆటంకాలు కలిగించినా.. అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేదని అన్నారు. కేంద్రం సహకారం అందించకపోయినా, తెలంగాణను ఉన్నతంగా నిలిపే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడంతో పాటు కలల్ని సాకారం చేసుకునే సత్తా తమకు ఉందన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను కేంద్రం రద్దు చేసినా, గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ రంగం 3.2 రెట్లు వృద్ధి చెందిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఐటీ రంగంలో వస్తున్న ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్లోనే వచ్చిందన్నారు. తమకు సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినా.. జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం కూడా రెట్టింపు అయ్యిందన్నారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినా, రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైందన్నారు. 20 వేల పారిశ్రామిక మంజూరుతో పాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయని చెప్పారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకపోయినా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు.
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
మిషన్ భగీరథకు నిధులు ఇవ్వకున్నా, 20 వేల చెరువులు పునరుద్ధరించామని.. ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకపోయినా, జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. జాతీయ హోదా ఇవ్వకపోయినా.. ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును సొంతంగా నిర్మించుకున్నామన్నారు. కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా.. పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల్ని పూర్తి చేసి తీరుతామని బల్లగుద్ది చెప్పారు. మిషన్ భగీరథకు సాయం అందించకపోయినా.. ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు.
తాజావార్తలు
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంటె సంగతులు అని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!