Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్ రాగానే ఈటల రాజేందర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని చిరునవ్వుతో పలకరించుకున్నారు. స్వయంగా ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్ గత సమావేశాల్లో చాలా సేపు మాట్లాడారు. చాలా కాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్ కూడా రాలేదు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత సమావేశాల్లో అనూహ్యంగా కేటీఆర్, ఈటల పలకరించడం చర్చనీయాంశమైంది. తాజా సమావేశాల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. ఈటెలకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆయన సతీమణి జమున స్వయంగా వ్యాఖ్యానించడంతో.. తానే స్వయంగా భద్రత కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ బంధం మరింత దృఢమైందని, తాజా సమావేశాల్లో గతం కంటే ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనమని గులాబీ నేతలు అభిప్రాయపడ్డారు.
Read also: Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిచంద్ కు సభ నివాళులర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయం లేని లోటు తీర్చలేమన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో విలీనం చేసేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. సాయన్న అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతికి సంతాపం తెలుపుతూ సభా వేదికపై ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సాయన్న మృతికి శాసన సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ రేపటికి (శుక్రవారం) వాయిదా పడింది.
Bandi Sanjay: తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి.. బండి సంజయ్ తో ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!