Bandi Sanjay: తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి.. బండి సంజయ్ తో ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ తో ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ విధివిధానాలపై చర్చించారు.
Read also: Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం శుక్రవారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నేతలతో కొద్దిసేపు సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న బండి సంజయ్కు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు చేరుకుంటారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర నేతలు, సీనియర్లు కూడా హాజరుకానున్నారు. అక్కడ ప్రసంగం అనంతరం నేరుగా కరీంనగర్ వెళతారని పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి.
Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!