Minister KTR: ఆ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలి.. ముర్ముకు కేటీఆర్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని.. అందుకు తామెంతో గర్విస్తున్నామన్నారు. తెలంగాణ పల్లెల్లో ఎక్కడా విద్యుత్ గోసలు లేవన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంట్ వచ్చిందని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు.
గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని ద్రౌపది ముర్మును కోరారు. పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలన్నా్రు. మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించేందుకు రాష్ట్రపతి కృషి చేయాలని కోరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే, కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నోరెట్లు ఎక్కువని ఆయన అన్నారు. భాజపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మంచిదికాదని, ఇప్పటికైనా మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు తావులేకుండా అందరు మహానుభావుల విగ్రహాలు సిరిసిల్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని విగ్రహాలు ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేస్తామన్నారు. తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
Rains Continue: వదలనంటున్న వాన.. హై అలర్ట్
ఆదర్శగ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. . మేము తెలంగాణకు ఏదో ఇస్తున్నామని మాట్లాడుతున్నారని.. 8 ఏళ్లలో తెలంగాణకు దేశం ఇచ్చింది తక్కువ… దేశానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువని ఆయన అన్నా్రు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!