Minister KTR: ఆ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలి.. ముర్ముకు కేటీఆర్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని.. అందుకు తామెంతో గర్విస్తున్నామన్నారు. తెలంగాణ పల్లెల్లో ఎక్కడా విద్యుత్ గోసలు లేవన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంట్ వచ్చిందని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు.
గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని ద్రౌపది ముర్మును కోరారు. పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలన్నా్రు. మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించేందుకు రాష్ట్రపతి కృషి చేయాలని కోరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే, కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నోరెట్లు ఎక్కువని ఆయన అన్నారు. భాజపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మంచిదికాదని, ఇప్పటికైనా మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు తావులేకుండా అందరు మహానుభావుల విగ్రహాలు సిరిసిల్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని విగ్రహాలు ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేస్తామన్నారు. తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
- Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
- Off The Record: కొండా ఫ్యామిలీ దారెటు..? కాంగ్రెస్లోనేనా.. కమలం వైపా..?
Rains Continue: వదలనంటున్న వాన.. హై అలర్ట్
ఆదర్శగ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. . మేము తెలంగాణకు ఏదో ఇస్తున్నామని మాట్లాడుతున్నారని.. 8 ఏళ్లలో తెలంగాణకు దేశం ఇచ్చింది తక్కువ… దేశానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువని ఆయన అన్నా్రు.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..