Rains Continue: వదలనంటున్న వాన.. హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత 15 రోజులుగా వానలు పడుతూనే వున్నాయి. వాన కురిస్తే చాలు జనం హడలిపోతున్నారు. వానలు కావాలని, మృగశిర కార్తెలో వానలు రావాలని గతంలో కోరుకున్నారు. కానీ ఇప్పుడు వానలు ఆగితే బాగుండు.. అనే భావనకు వచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు చేసింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ. ఈరోజు ఉత్తర ఒరిస్సా, పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉందని వాతావరణ అధికారి తెలిపారు.
మరోవైపు ఉత్తర – దక్షిణ ద్రోణి ఈరోజు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేశారు. ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడా తెలంగాణా రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
- TG TET 2026 Results: టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన
ఇటు ఉదయం నుంచి హైదరాబాద్ లో వాన పడుతూనే వుంది. కొన్ని ప్రాంతాల్లో భారీవర్షం పడింది. సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులను తలపిస్తున్నాయి కంటోన్మెంట్, బోయిన్ పల్లి రోడ్లు. స్కూళ్ళనుంచి వచ్చే విద్యార్ధినీ, విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ళు తెరిచి వాన నీటిని పంపిస్తున్నారు. కార్యాలయాల నుంచి బయటకు వచ్చేవారికి ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే ఒకేసారి ఉద్యోగులు బయటకు రావద్దంటున్నారు. విపరీతమయిన ట్రాఫిక్ జాం ఏర్పడి ఇబ్బందులు పడతారని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
-
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
-
Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!