KTR: మోడీ చెప్పేవన్నీ గాలి మాటలే.. పెంచిన ధరలకు దండం పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ది అన్నారు కేటీఆర్. తెలంగాణలో రెండేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు ఉండబోవన్న ఆయన.. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాదించుకున్నాం.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చామన్నారు. బీడువడ్డ వరంగల్ భూములకు దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో సాగు నీరు ఇచ్చామన్న కేటీఆర్.. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.
Read Also: కెజిఎఫ్2′ హిట్ తో ‘సలార్’ ప్లాన్ లో మార్పు!
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
ఇక, 50 వేల కోట్ల రూపాయలతో రైతు బంధు ఇచ్చాం.. 22 వేల కోట్ల రూపాయాలతో రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి కేటీఆర్.. నర్సంపేట అబివృద్ధికి మరో 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రటించిన ఆయన.. త్వరలోనే ప్రతిఊర్లో కొత్త పెన్షన్లు మొదలుపెడతామన్నారు. 973 గురుకుల పాఠశాలల్లో, 5 లక్షల విద్యార్థులకు 6 వేల కోట్లు ఖర్చు చేశామని.. కరోనా కారణంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆలస్యం అయ్యాయని తెలిపారు ఇక, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమేనని ఆరోపించిన కేటీఆర్.. పెంచిన పెట్రో, గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు.. కోటి మాటలు చెప్పి పది పైసల పనిచేయలేనిది బీజేపీ ప్రభుత్వమన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి దేశంలోని నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు.. మన కడుపులో బాధ కేసీఆర్కే తెలుస్తుంది.. ఇంటి పార్టీ టీఆర్ఎస్ను దీవించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!