పురపాలక సంఘాల అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ప్రభుత్వ చిత్తశుద్ధితోనే తెలంగాణ పురపాలికలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరితో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న అనంతరం వీరందరితో ఈ రోజు ఢిల్లీలోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల చైర్ పర్సన్ లకు, పురపాలక శాఖ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ గ్రామీణ ప్రాంతాలు అన్న విభేదం లేకుండా సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకుపోతుందన్న మంత్రి కేటీఆర్, పట్టణ అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టణాలకు ప్రత్యేక నిధులు కల్పించడంతోపాటు, పట్టణాలకు ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకువచ్చిన అనేక వినూత్న కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ మరియు కృషితో పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పట్టణ పరిపాలనలో పియం స్వనిది వంటి అనేక కార్యక్రమాల్లోనూ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు.
Also Read
ఇక తెలంగాణకి జాతీయ స్థాయిలో సఫయి మిత్ర ద్వితీయ స్థానం అవార్డుతో పాటు మరో 11 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను దక్కించుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పురపాలక శాఖ సిబ్బంది, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధుల నిబద్ధత కలిగిన కృషి, సమన్వయంతోనే ఇది సాధ్యమవుతున్నదని మంత్రి అన్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో స్వఛ్చ అవార్డులు దక్కించుకున్న పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కూడా మరింత చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రావడంతో పాటు, మంత్రి కేటీఆర్ తమకు ప్రత్యేక అభినందనలు తెలపడం పట్ల, పురపాలక సంఘాల ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి గారి నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో తమ పట్టణాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!