Minister KTR: ఓల్డ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో విస్తరణ.. మంత్రి కేటీఆర్ క్లారిటీ..
Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Read Also: Delhi Mayor Election: ఫిబ్రవరి 16 ఢిల్లీ మేయర్ ఎన్నిక.. మేయర్ పీఠం కోసం బీజేపీ-ఆప్ ఫైట్
Also Read
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
హైదరాబాద్ లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో ఉందిన.. గతంలో మెట్రో మొత్తం పీపీపీతో నడిచిందని.. ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది రాష్ట్రప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అని వెల్లడించారు. చాలా మంది కరోనా తర్వాత రవాణా కష్టాలు పడ్డారని అన్నారు. ఎయిర్ పోర్టు మెట్రలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడుతామని వెల్లడించారు.
ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని.. కేంద్రం కనీసం తెలంగాణపై కనికరం చూపెట్టడం లేదని ఆరోపించారు. ముంబై, గుజరాత్, తమిళనాడులో మెట్రోకు నిధులు ఇచ్చారు..కానీ తెలంగాణకు పైసా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర డబ్బులు ఇచ్చిన ఇవ్వకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకు వెళ్తాం అని అన్నారు. ఇక ఛార్జీలు పెంపు చేయము అని ప్రకటించారు. మాకు చెప్పకుండా ఛార్జీలు పెంచొద్దని మెట్రో అధికారులకు చెప్పామని వెల్లడించారు. ఆర్టీసీ తరహాలో ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పామన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడగింపు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని.. మిగతా మెట్రో పనులు కూడా చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!