Minister KTR: ఓల్డ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో విస్తరణ.. మంత్రి కేటీఆర్ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Read Also: Delhi Mayor Election: ఫిబ్రవరి 16 ఢిల్లీ మేయర్ ఎన్నిక.. మేయర్ పీఠం కోసం బీజేపీ-ఆప్ ఫైట్
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
హైదరాబాద్ లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో ఉందిన.. గతంలో మెట్రో మొత్తం పీపీపీతో నడిచిందని.. ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది రాష్ట్రప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అని వెల్లడించారు. చాలా మంది కరోనా తర్వాత రవాణా కష్టాలు పడ్డారని అన్నారు. ఎయిర్ పోర్టు మెట్రలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడుతామని వెల్లడించారు.
ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని.. కేంద్రం కనీసం తెలంగాణపై కనికరం చూపెట్టడం లేదని ఆరోపించారు. ముంబై, గుజరాత్, తమిళనాడులో మెట్రోకు నిధులు ఇచ్చారు..కానీ తెలంగాణకు పైసా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర డబ్బులు ఇచ్చిన ఇవ్వకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకు వెళ్తాం అని అన్నారు. ఇక ఛార్జీలు పెంపు చేయము అని ప్రకటించారు. మాకు చెప్పకుండా ఛార్జీలు పెంచొద్దని మెట్రో అధికారులకు చెప్పామని వెల్లడించారు. ఆర్టీసీ తరహాలో ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పామన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడగింపు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని.. మిగతా మెట్రో పనులు కూడా చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!