Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.