Harish Rao: గాంధీ కలగన్న కళకు సంగారెడ్డి జిల్లా నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Thanneeru: సంగారెడ్డి జిల్లా గాంధీ కలగన్న కళకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు సంగారెడ్డి జిల్లా పర్యటలో సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మంత్రి పాల్గొని ర్యాలీని ప్రారంభించి, 75 అడుగుల మువ్వెన్నల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని పండుగలు కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుందో వజ్రోత్సవ వేడుకలు అలా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. అన్నామో రామచంద్ర అన్నట్టు దేశంలో పరిస్థితి ఉండేదని, ఇప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానములో ఉందని గుర్తు చేశారు. స్వంత ఆదాయ వృద్ధి రేటుతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని, ఇది మన టీఆర్ఎస్ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే విభిన్నంగా నిలిచింది తెలంగాణ అని పేర్కొన్నారు.
read also: Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
మన రాష్ట్రా తలసరి ఆదాయం లక్ష 24 వేలు ఉంటే.. ఇప్పుడు 2 లక్షల 78 వెలతో అగ్రస్థానంలో ఉన్నాని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మన బడ్జెట్ 62 వేల కోట్లు, గతేడాది లక్ష 24 వేల కోట్లు అని స్పష్టత ఇచ్చారు. ఏడేళ్లలో మూడింతల వృద్ధి రేటు సాదించినామన్నారు. కేంద్రం ఈ మధ్య అవార్డులు ప్రకటించిందని, సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దేశంలో ఉత్తమ గ్రామాలు 20 ఉంటే అందులో 19 మన తెలంగాణావే అని ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర పథకంతో వరం ప్రకటించారని తెలిపారు. ఎల్లుండి నుంచి 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు హరీశ్ రావ్. స్వాతంత్ర్య ఫలాలు అందరికి దక్కాలంటే కులాలకు, మతాలకు అతీతంగా పని చేయాలని పేర్కొన్నారు.
read also: Komatireddy Venkat Reddy: సారీ కాదు.. సస్పెండ్ చేయాల్సిందే..!
ఈ మధ్య కొన్ని విచిన్నకర శక్తులు కులాల మధ్య, మతాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయిని తెలిపారు. విచిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలని హరీశ్రావ్ సూచించారు. కొంత మంది ఇలా చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసి లాభం పొందాలని చూస్తున్నారని తెలిపారు. మనకు కులాలతో మతాలతో మతం పని లేదని అన్నారు. కులం, మతంతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని తెలిపారు. అందరూ గాంధీ సినిమా చూడాలని పిలుపు నిచ్చారు. పార్టీ జెండాలను కింద పడేస్తాం.. కానీ జాతీయ జెండాను కింద పడేయవద్దని సూచించారు. జెండాను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి, ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు హరీశ్ రావ్ కోరారు.
Bhadradri Kothagudem: వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధుల “నాటు నాటు” డ్యాన్స్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!