Bhadradri Kothagudem: వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధుల “నాటు నాటు” డ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leaders dance to Natu Natu song in Bhadradri Kothagudem District: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. కేంద్రం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయభావం వెల్లివిరుస్తోంది. తాజాగా ఈ రోజు నుంచి ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ప్రారంభం అయింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తమ నివాసాల్లో జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు తెలంగాదణ ప్రభుత్వం కూడా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు వజ్రోత్సవ వేడుకలను ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు.
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం వజ్రోత్సవ వేడుకల్లో అపవిత్రం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వజ్రోత్సవ కార్యక్రమాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత దేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలియజేయాల్సింది పోయి సినిమా పాటకలు స్టెప్పులేస్తూ.. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. బ్రిటీష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందేందుకు ఎంత మంది వీరులు, త్యాగులు, నాయకులు కష్టపడ్డారో.. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా విలువేంటో భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కొందరు ప్రజాప్రతినిధులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వజ్రోత్సవ వేడుకల్లో సినిమా పాటలకు స్పెప్పులేశారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు డ్యాన్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు జాతీయ జెండాలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. జాతీయ జెండాల సాక్షిగా సినిమా పాటలకు స్పెప్పులేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తి గీతాలుకు బదులు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ వజ్రోత్సవ వేడుకలను సినిమా ర్యాలీగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!