Harish Rao: తెలంగాణలో బీజేపీ ఫెయిల్.. టీఆర్ఎస్ పాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా దవాఖానాకు , రూ.కోటి వ్యయంతో టీ డయాగ్నస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు .
నారాయణపేట జిల్లాలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి కూడా లేదన్న హరీశ్ .. ఇవాళ 390 పడకల మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు . మహబూబ్ నగర్ లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేదన్నారు. నాగం, డీకే అరుణ ఈ జిల్లా మంత్రులుగా ఉండి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఏడేండ్లలో తెలంగాణలో మెడికల్ కాలేజ్ ల సంఖ్య 33 కి పెంచామన్నారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే సాధ్యం అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ఏర్పాటు అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు.
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
read also:
Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి
మెడికల్ కాలేజీ కోసం భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …పరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరు పని చేస్తారో ప్రజలు గమనించాలని పేర్కొన్న హరీశ్.. బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ జిల్లాలో పాదయాత్ర చేశారని విమర్శించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. అక్కడ ఆరు గంటల కరెంట్ కూడా లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అయిందని …టీఆర్ఎస్ పాస్ అయిందన్నారు.
తెలంగాణలో వడ్ల కుప్పల దగ్గర లొల్లి పెడుతున్న బీజేపీ నేతలు.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎందుకు కొనట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏది అడిగితే అది ఇస్తాం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ , మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!