Harish Rao: తెలంగాణలో బీజేపీ ఫెయిల్.. టీఆర్ఎస్ పాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా దవాఖానాకు , రూ.కోటి వ్యయంతో టీ డయాగ్నస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు .
నారాయణపేట జిల్లాలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి కూడా లేదన్న హరీశ్ .. ఇవాళ 390 పడకల మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు . మహబూబ్ నగర్ లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేదన్నారు. నాగం, డీకే అరుణ ఈ జిల్లా మంత్రులుగా ఉండి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఏడేండ్లలో తెలంగాణలో మెడికల్ కాలేజ్ ల సంఖ్య 33 కి పెంచామన్నారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే సాధ్యం అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ఏర్పాటు అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
read also:
Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి
మెడికల్ కాలేజీ కోసం భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …పరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరు పని చేస్తారో ప్రజలు గమనించాలని పేర్కొన్న హరీశ్.. బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ జిల్లాలో పాదయాత్ర చేశారని విమర్శించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. అక్కడ ఆరు గంటల కరెంట్ కూడా లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అయిందని …టీఆర్ఎస్ పాస్ అయిందన్నారు.
తెలంగాణలో వడ్ల కుప్పల దగ్గర లొల్లి పెడుతున్న బీజేపీ నేతలు.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎందుకు కొనట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏది అడిగితే అది ఇస్తాం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ , మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!