Harish Rao: తెలంగాణలో బీజేపీ ఫెయిల్.. టీఆర్ఎస్ పాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా దవాఖానాకు , రూ.కోటి వ్యయంతో టీ డయాగ్నస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు .
నారాయణపేట జిల్లాలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి కూడా లేదన్న హరీశ్ .. ఇవాళ 390 పడకల మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు . మహబూబ్ నగర్ లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేదన్నారు. నాగం, డీకే అరుణ ఈ జిల్లా మంత్రులుగా ఉండి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఏడేండ్లలో తెలంగాణలో మెడికల్ కాలేజ్ ల సంఖ్య 33 కి పెంచామన్నారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే సాధ్యం అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ఏర్పాటు అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు.
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
read also:
Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి
మెడికల్ కాలేజీ కోసం భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …పరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరు పని చేస్తారో ప్రజలు గమనించాలని పేర్కొన్న హరీశ్.. బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ జిల్లాలో పాదయాత్ర చేశారని విమర్శించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. అక్కడ ఆరు గంటల కరెంట్ కూడా లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అయిందని …టీఆర్ఎస్ పాస్ అయిందన్నారు.
తెలంగాణలో వడ్ల కుప్పల దగ్గర లొల్లి పెడుతున్న బీజేపీ నేతలు.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎందుకు కొనట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏది అడిగితే అది ఇస్తాం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ , మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..