Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger attacks: పులుల సంచారం జనంలో భయాందోళనరేకెత్తిస్తోంది..వరుసబెట్టి పశువులపై పంజా విసురుతుండడంతో జనం వణికిపోతున్నారు..ఎక్కడ ఎటు వైపు నుంచి వచ్చి విరుచుక పడుతుందోనని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. కొమురం భీం జిల్లాతోపాటు ఆదిలాబాద్, భూపాలపల్లి, మహారాష్ట్రలో పులుల సంచారం కలకలం రేపుతోంది.
కొమరంభీం జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిదిలో పులుల సంచారం పెరిపోతుంది. మరీ ముఖ్యంగా కాగజ్ నగర్ మండలం వేంపల్లి, కోసిలి, అనుకొడ ప్రాంతాల్లో వారం రోజులుగా పులుల సంచరిస్తున్నాయి. అంతేకాదు వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే పది రోజుల్లో 8 పశువులను చంపేసిన పులి తాజాగా మండలం కోసిని బెస్ క్యాంప్ పక్కన అటవిలో ఎద్దు పై దాడి చేసింది.పులి దాడి లో ఎద్దు తీవ్రగాయాలో ఇంటికి చేరింది. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ,అలాగే తలమడుగు మండలాల్లో మహరాష్ట్ర నుంచి వచ్చిన పులి సంచరిస్తుంది..మొన్న బజార్ హత్నూర్ మండలంలోని ఆవులమందపై దాడి చేసిన పులి ఓ ఆవును చంపేసింది. తలమడుగు మండలంలో పల్సిబి.శివారులో పులిదాడిలో ఎద్దు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారంతో అక్కడకు చేరుకున్న అధికారులు చనిపోయిన ఎద్దు కుచులాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నకు చెందిందిగా గుర్తించారు. పులి సంచారం నిజమేనని సాయంత్రం, ఉదయం వేళల్లో అటవీ ప్రాంతాల వైపు వెల్లవద్దని పోలీసులు హెచ్చరించారు..ఈరెండు జిల్లాల్లో పులుల సంచారం, పశువులపై పడి చంపేస్తుంటే రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం పులి రక్షణతోపాటు జనం రక్షణ కోసం చర్యలు చేపట్టుతున్నట్లు చెప్పుతున్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Read also: Kotideepotsavam 2022: ఐదవ రోజుకి చేరిన కోటి దీపోత్సవం.. ఈ రోజు ఏముంటాయంటే?
ఇక భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో పెద్దపులి బీభత్సం సృష్టిస్తోంది. కామన్ పల్లి కిష్టపురంపాడ్, దేవాదుల ప్రాజెక్ట్ పైపులైన్ సమీపంలో ఆవు, లేగదూడపై దాడి చేసి చంపేసింది. పులి కదలికలను గుర్తించెందుకు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమరాలను అమర్చారు. పులి సంచారంతో.. పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహా రాష్ట్ర లోని గడ్చిరోలీ, చంద్రా పూర్ రెండు జిల్లాల్లో పులుల దాడులు సంచలనంగా మారింది. ఇద్దరి వ్యక్తులపై పులి పంజావేయడంతో వారు చనిపోయారు. చంద్రాపూర్ జిల్లా లో ఒక్కరు, గడ్చిరోలీ జిల్లా లో ఒక్కర్ని పులి చంపేసింది. మృతులు చంద్రాపూర్ జిల్లా తోర్గావ్ కు చెందిన జయా బాయి తోండ్రే గా గుర్తించారు పోలీసులు, మరో వ్యక్తి గడ్చిరోలి జిల్లా రాజగాటా కు చెందిన సుధాకర్ బోయర్ గా గుర్తించారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరించారు. సాయంత్రం, రాత్రి వేళలో ప్రజలు బయట సంచరించకూడదని తెలిపారు.
Refrigerator Blast: ప్రాణాలు తీస్తున్న ఫ్రిజ్లు, గీజర్లు..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..