Refrigerator Blast: ప్రాణాలు తీస్తున్న ఫ్రిజ్లు, గీజర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
Read Also: T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
చెంగల్పట్టు జిల్లా ఊరప్పక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని కోదండరామన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కోదండరామన్ నగర్ లో ఓ ఇంట్లో నివసిస్తున్న గిరిజ (63), రాధ (55), రాజ్కుమార్ (47) మృతి చెందగా.. ఆరాధయ(6), భారతి(35) గాయపడ్డారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలడంతో ఇంట్లో భారీగా పొగలు రావడంతో ముగ్గురు ఊపిరి ఆడక చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే గుడువంచెరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మండలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ కంప్రెషర్ పేలి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మన సౌకర్యార్థం వాడుకుంటున్న ఎలక్ట్రానిక్ పరికరాలే మన ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో గీజర్ పేలి ఇద్దరు యువ వైద్యులు చనిపోయారు. గీజర్ పేలడంతో పాటు ఆదే సమయంలో కరెంట్ షాక్ గురయ్యాడు భర్త. భర్తను కాపాడే క్రమంలో భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ నిసారుద్దీన్.. ఆయన భార్య ఉమ్మే మొహిమీన్ సైమా చనిపోయారు.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!