Revanth Reddy: పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో.. రూట్ మార్పుతో తగ్గనున్న వ్యయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీలను రద్దు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ పనులు జరుగుతున్నాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో దూరం తగ్గిస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో లైన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్కు లింక్ ఉంటుందని సీఎం చెప్పారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు మెట్రోను విస్తరింపజేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోల్చితే కొత్తగా ప్రతిపాదించిన మెట్రో కారిడార్లను తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తామని రేవంత్ చెప్పారు. కాలుష్యం లేని ఫార్మాసిటీ, రింగ్రోడ్డు, రీజనల్ రింగ్రోడ్డు మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి ప్రత్యేక కాస్టర్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
Read also: Liqour Sales New Record: న్యూ ఇయర్ జోష్.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కూలీలు హైదరాబాద్ రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కిల్స్కు రెగ్యులర్ డిగ్రీలకు సంబంధించిన అన్ని అర్హతలు ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు. మరోవైపు 100 పడకల ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ కల్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చుతుంది. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం రేవంత్ వివరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని భర్తీ చేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయితే అవసరమైన ఉద్యోగాలను తామే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతిభావంతులైన విభాగాధిపతులను నియమించే బాధ్యత ఆయనదే. అధికారుల నియామకంలో సామాజిక న్యాయం కూడా ఉంటుంది. తనకు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి లేదని రేవంత్ స్పష్టం చేశారు.
RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!