Sri Lakshmi Constructions Fraud: శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మీ అరెస్టు.. రిమాండ్కు తరలింపు!
- శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండి విజయలక్ష్మీ అరెస్టు.. రిమాండ్కు తరలింపు!..
- అమెరికాకు పారిపోతుండగా ఎయిర్ పోర్టులోనే విజయలక్ష్మీ అరెస్ట్..
- విజయలక్ష్మీ అరెస్ట్ వివరాలు వెల్లడించిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎన్ టీవీతో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భావన జీఎల్సీ వెంచర్ పేరుతో ప్రభుత్వ భూమి, చెరువులో విల్లాలను నిర్మించారు.. గుర్రం విజయ లక్ష్మీపై దాదాపు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారని పేర్కొన్నారు. 2021 నుంచి ఆమెపై ఏడుకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 5 కేసుల్లో కోర్టు నుంచి నాట్ టూ అరెస్టు ఆర్డర్ తెచ్చుకుంది.. మరో రెండు కేసులను బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం అని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Read Also: Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
Also Read
ఇక, ఈ రెండు కేసులను బేస్ చేసుకొని శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మీకి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసేలా చర్యలు చేపట్టామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమె అమెరికన్ సిటిజన్, గ్రీన్ కార్డ్ హోల్డర్ కావడంతో ఎప్పటికైనా అమెరికాకు పారిపోతుందని భావించాం.. ఇదే క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు వెళ్లేందుకు చెక్ ఇన్ అయ్యింది.. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ పోర్ట్ లో విజయ లక్ష్మీని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. లీగల్ గా ఆమెపై అన్ని రకాల చర్యలు చేపట్టేలా ఎవిడెన్స్ సేకరించాం.. గ్రీన్ కార్డు హోల్డర్ అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే విజయ లక్ష్మీకే ఉంటుంది అన్నారు. ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశాం.. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విల్లా డబ్బులు ఎక్కడికి బదిలీ చేసింది అనేది తేలుస్తామని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!