Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
- తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ .
- ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర అంటూ వ్యాఖ్యలు.
- ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అనుమతి తీసుకుందామని సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
Also Read
రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని.. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే, అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కానీ వీరిలో మొత్తం 40 వేల మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరుచేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్దిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్దిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?