Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
- తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ .
- ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర అంటూ వ్యాఖ్యలు.
- ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అనుమతి తీసుకుందామని సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని.. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే, అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కానీ వీరిలో మొత్తం 40 వేల మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరుచేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్దిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్దిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..