Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Leader Bandi Sanjay Accuses Congress Government Of Stalling Rythu Bharosa Scheme Citing Election Code

Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర

Published Date :January 31, 2025 , 1:43 pm
By Kothuru Ram Kumar
  • తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ .
  • ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర అంటూ వ్యాఖ్యలు.
  • ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అనుమతి తీసుకుందామని సూచన.
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?

రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని.. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే, అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కానీ వీరిలో మొత్తం 40 వేల మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు.

Also Read: BRS MLAs Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు.. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరుచేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్దిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్దిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • Congress government
  • election code
  • farmers welfare

తాజావార్తలు

  • Israel-Khamenei: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖమేనీకి ఇష్టమైన వాటిపై ఎటాక్

  • Pawan Kalyan: సినిమా టికెట్ రేట్ల పెంపుపై పవన్ సంచలన వ్యాఖ్యలు

  • Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

  • Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions