Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
- తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ .
- ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర అంటూ వ్యాఖ్యలు.
- ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అనుమతి తీసుకుందామని సూచన.
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
Also Read
రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని.. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే, అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కానీ వీరిలో మొత్తం 40 వేల మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరుచేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్దిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్దిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!