Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Madhu Yaskhi Kaleshwaram Allegations Kcr Kavitha

Madhu Yaskhi : కాళేశ్వరం కుంభకోణం: కవిత, కేసీఆర్‌పై యాష్కీ సంచలన ఆరోపణలు

Published Date :September 20, 2025 , 6:17 pm
By Gogikar Sai Krishna
  • మధు యాష్కీ కాళేశ్వరం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు
  • "కవిత, జైలు నుంచి వచ్చి బలహీన వర్గాల గురించి మాట్లాడటం విడ్డూరం"
  • ఎమ్‌పీగా ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేసినదని ఆరోపణ
  • కేంద్రం సీబీఐ విచారణ ఆలస్యం చేస్తోందని యాష్కీ విమర్శ
Madhu Yaskhi : కాళేశ్వరం కుంభకోణం: కవిత, కేసీఆర్‌పై యాష్కీ సంచలన ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Madhu Yaskhi : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబానికి ‘ఏటీఎం’గా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారని గుర్తుచేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా ఇప్పటికీ అది ప్రారంభం కాలేదని ఆయన ఆరోపించారు.

“ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట సీబీఐ, ఈడీలు వచ్చేవి. కానీ ఇక్కడ కేసీఆర్‌పై అసెంబ్లీలో విచారణకు ఆదేశించినా కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు?” అని మధు యాష్కీ ప్రశ్నించారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల తర్వాత కవితకు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని, జైలుకు పోయి వచ్చిన ఆమె నీతులు చెప్పడం, అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

Also Read

  • Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

CAG Report: 10 ఏళ్లలో భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే..?

“పదేళ్లు బడుగులను దోచిన కవిత… ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం ఏంటి?” అని యాష్కీ ప్రశ్నించారు. కవిత వ్యవహారం చూస్తుంటే కేసీఆర్ రచించిన నాటకం నుండి బయటకు వస్తున్నట్టు ఉందని, కేసీఆర్ రచించిన ‘కవిత’లో కవిత ఓ భాగమని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్‌గానే ఉంటారని, తప్పితే వెనకాల ఉండి చేయడం ఆయనకు అలవాటు లేదని చెప్పారు. కవిత వెనకాల సీఎం ఉన్నాడనేది చవకబారు ప్రచారమేనని ధ్వజమెత్తారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉంటాయని యాష్కీ ధీమా వ్యక్తం చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే ఏం చెప్పాలి అనే దానికోసం కేసీఆర్ కుటుంబం డ్రామా చేస్తుందా?” అని ప్రశ్నించారు. కవితపై నేరుగా ఆరోపణలు చేస్తూ, హిమాయత్‌నగర్‌లో ఉన్న విమలక్క ఆఫీస్‌ను ఖాళీ చేయించిందని, ఎక్కడా రెంట్ ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. కవితకు పోటీగా బతుకమ్మ పెట్టిందని కక్ష సాధించిందని, అలాంటి కవిత ఇప్పుడు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుందని విమర్శించారు.

ఎంపీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో డబ్బులు దండుకున్నదని, 10 మందికి శిక్షణ ఇచ్చి 100 మంది డబ్బులు దోచుకుందని యాష్కీ ఆరోపించారు. రైతుల కుటుంబాలను ఆదుకుంటాం అని డబ్బులు వసూలు చేసి వెనకేసుకుందని, హీరో నాగార్జున లాంటి వాళ్ల నుండి కూడా డబ్బులు వసూలు చేసి రైతులకు ఇస్తా అన్నదని చెప్పారు.

భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ… ఎన్‌డీఏ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని యాష్కీ అంచనా వేశారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం కోసం కేసీఆర్‌ను రక్షించే కుట్రను బీజేపీ చేస్తుందని, అందుకే సీబీఐ విచారణను ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. “విచారణ చేసి కూడా కేసీఆర్ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం కూడా జరగొచ్చు” అని ఆయన హెచ్చరించారు. కేటీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించిన యాష్కీ.. “కేటీఆర్… సీఎం రమేష్‌ను కలవలేదు అని చెప్పలేదు. చర్చ చేయలేదు అని కూడా చెప్పడం లేదు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ నుండి ఇంకా స్పందన రావాల్సి ఉంది.

Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Kaleshwaram Scam
  • Kavitha
  • kcr
  • Madhu Yaskhi

తాజావార్తలు

  • Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..

  • PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు

  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions