తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఎల్లుండి నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. ఇక, వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్తో పాటు వాటికి సంబంధించిన 20 రకాల సేవలపై విధించే ఛార్జీలు పెరగనున్నాయి.. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర వడ్డించనున్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల విలువు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి.. మొత్తంగా ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4 శాతం ఉండగా ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లిస్తున్నారు.. కానీ ఇప్పుడు ఇవి పెరగనున్నాయి.. తెలంగాణలో ఎల్లుండి నుంచి అల్లోకి వచ్చేవి పరిశీలిస్తే.. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విక్రయ అగ్రిమెంట్/జీపీఏ, డెవలప్మెంట్ అగ్రిమెంట్, జీపీఏ, డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్, కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు, గిఫ్ట్, టైటిల్ డీడ్ డిపాజిట్, జీపీఏ, వీలునామా, లీజు సహా ఇతర సేవల ఛార్జీలు పెరగనున్నాయి. నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలు సమరించింది ప్రభుత్వం..
Also Read
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
తాజావార్తలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!