Big News : రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. కూనంనేని, చాడ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి సీపీఐ పిలుపునిచ్చింది. అయితే.. దీనిలో భాగంగా.. ఈ రాజ్భవన్ ముట్టడిలో భారీగా సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ ముట్టడికి వస్తున్న సీపీఐ నాయకులను ఖైరతాబాద్ సర్కిల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకొని, పోలీసులకు సీపీఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Chellaboina venugopal: బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం జగన్
అయితే.. కూనంనేని, చాడల అరెస్ట్పై సీపీఐ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని, గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూనంనేని. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
Also Read
అంతకు ముందు ఎన్టీవీతో కూనంనేని మాట్లాడుతూ.. కవిత పై కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, అసలు లిక్కర్ కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై దాడులు చేశారన్నారు. వాళ్ళు బీజేపీ లో చేరగానే పునితులు అయ్యారని, షర్మిలకు మోడీ ఫోన్ చేసి పలకరించే సమయం ఉంది కానీ… బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులు.. హత్యలు చేసిన బాధితులను పరామర్శించే సమయం లేదన్నారు. మోడీ రాజనీతిజ్ఞుడు కాదని, గవర్నర్ వ్యవస్థతో ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ అన్నారు.
తాజావార్తలు
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!