Kakatiya Photo Exhibition: అరవింద్ ఆర్య 777 ఫొటోలు.. సన్మానించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అరవింద్ ఆర్యను మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కొన్ని చిత్రాలు చూస్తుంటే సంతోషం కలిగిందన్నారు. అయితే.. చాలా మందిరాలు, ప్రాంగణాలు కూలిపోయినా పట్టించుకోని పరిస్థితి మరికొన్ని ఛాయాచిత్రాల్లో కనిపించిందన్నారు. అలాంటి వాటిని చూస్తే బాధ కలుగుతోందని, సిగ్గనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా.. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సంపాదించడం మనం సాధించిన అతిగొప్ప విజయాల్లో ఒకటన్నారు.
read also: Live: వైసీపీ ప్లీనరీ సమావేశాలు l YSRCP Plenary Meeting 2022 Day 1 l Ntv Live
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మరికొద్ది ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా అక్కడ ఉండే కట్టడాలు, శిల్పాలకు ప్రమాదం ఉందని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి, మానవీయ స్ఫూర్తికి మారుపేరుగా నిలిచిన కాకతీయ పాలకులను ఇప్పటికీ తెలంగాణ సమాజం గర్వంగా తలుచుకుంటుందని అన్నారు. కాకతీయుల స్ఫూర్తి తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో రాష్ట్రంలోని చెరువుల పునురుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, నన్నపునేని నరేందర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Mahbubnagar: వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!