KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్ పేట్ లో కేటీఆర్ రోడ్ షో
- జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్పేట్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు.
పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్, “కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలి” అని పిలుపునిచ్చారు. “జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ గెలవడం ఖాయం. కానీ మెజార్టీ ఎంత అనేది మన చేతిలో ఉంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నియోజకవర్గంలో దివంగత మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడం బాధాకరం. కానీ ఇప్పుడు ఆయన స్ఫూర్తితో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకే ఓటేయండి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
అంతేకాకుండా.. “హిట్లర్ నశించడాన్ని చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడదు. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లు కూల్చడమా? ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నాడు” అని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ఒక్క నియోజకవర్గం కాదు, ఒక కుటుంబం. నా భర్త గోపీనాథ్ ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యలకు అండగా నిలిచేవారు. ఆ బాటలో నేనూ నడుస్తాను. ఎవరికి భయపడను, ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
Cyclone Montha Damage: తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..
తాజావార్తలు
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
-
Varun Tej: రిలీజ్కు ముందే వరుణ్ తేజ్ జాక్పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
-
Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!