KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్ పేట్ లో కేటీఆర్ రోడ్ షో
- జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్పేట్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు.
పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్, “కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలి” అని పిలుపునిచ్చారు. “జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ గెలవడం ఖాయం. కానీ మెజార్టీ ఎంత అనేది మన చేతిలో ఉంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నియోజకవర్గంలో దివంగత మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడం బాధాకరం. కానీ ఇప్పుడు ఆయన స్ఫూర్తితో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకే ఓటేయండి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
అంతేకాకుండా.. “హిట్లర్ నశించడాన్ని చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడదు. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లు కూల్చడమా? ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నాడు” అని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ఒక్క నియోజకవర్గం కాదు, ఒక కుటుంబం. నా భర్త గోపీనాథ్ ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యలకు అండగా నిలిచేవారు. ఆ బాటలో నేనూ నడుస్తాను. ఎవరికి భయపడను, ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
Cyclone Montha Damage: తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..