Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- కోల్కతా హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- 9 మంది మృతి, ఆరుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 1:45 గంటలకు ఘటన
పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 1:45 గంటల సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల కారణంగా హోటల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మెట్ల మార్గం ద్వారా పై అంతస్తులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
- Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్లో ఎవరైనా ఇంకా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రస్తుతం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అదే సమయంలో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం హోటల్కు సమీపంలోనే ఉండటం గమనార్హం. వరుసగా చోటుచేసుకుంటున్న హోటల్ అగ్నిప్రమాదాలు పశ్చిమ బెంగాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. హోటళ్లలో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, భద్రతా వ్యవస్థలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!