Cyclone Montha Damage: తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..
- తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక..
- 17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక..
- తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha Damage: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో భారీ నష్టాన్ని మిగిల్చింది.. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా.. కోట్లలో నష్టం వాటిల్లింది.. అయితే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక అందచేసింది. మొత్తం రూ.5,244 కోట్ల మేర నష్టం వచ్చినట్టు నివేదికలో పేర్కొంది ప్రభుత్వం.. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని కోరారు… 249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడినట్లు ప్రాథమిక నివేదికలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Asia Cup 2025: రెండు రోజుల్లో భారత్కు ఆసియా కప్.. !
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మొంథా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపిన విషయం విదితమే.. ఈ తుఫాన్ను రియల్ టైమ్లో పర్యవేక్షించి, ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని వెల్లడించారు.. తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన పంటలు- రూ.39 కోట్లు, పట్టు పరిశ్రమ- రూ.65 కోట్లు, ఆక్వా- రూ.1,270 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు- రూ.2,079 కోట్లు, పురపాలక శాఖ- రూ.109 కోట్లు, జలవనరుల విభాగం-రూ.207 కోట్లు, పంచాయతీరాజ్- రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ- రూ.16 కోట్లు ఇలా భారీ నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!