Focus on farmers: అందరి చూపు రైతుల వైపు.. రైతులకు భరోసా ఇవ్వడానికి కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Focus on farmers: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు రైతులపై దృష్టి సారించాయి. అన్ని రాజకీయ పార్టీలు రైతులకు భరోసా కల్పించి రైతులకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రైతులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంట నష్టపోయిన తెలంగాణ రైతులు రైతుల పొలాల్లోకి వెళ్లి స్వయంగా పంటనష్టం వివరాలను సేకరించి పంట సాయం కోసం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని బీజేపీ నేతలు సూచించారు.
Read also: Revanth Reddy: కేసీఆర్ కొనకపాయే.. చేతికొచ్చిన పంట ఆగమైపాయే
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం బీజేపీ తరపున పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సైతం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించి నష్టపరిహారం ఇచ్చే వారు లేకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలకు రైతులపై అపారమైన ప్రేమ ఉందని రైతులు భావిస్తున్నారు.
Oscars: 96వ ఆస్కార్ అవార్డుల హంగామా మొదలు!
- Tags
- bandi sanjay
- Crop
- Damage
- Farmers
- ktr
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!